రవితేజ ఇడియట్ హీరోయిన్ రక్షిత సోదరుడు హీరోగా ఏలుమలై- పూరి జగన్నాథ్తో టీజర్, కన్నడ హీరో శివరాజ్ కుమార్తో పోస్టర్ రిలీజ్
రవితేజ ఇడియట్ సినిమాలో హీరోయిన్గా అలరించిన రక్షిత సోదరుడు రాన్నా హీరోగా తెరకెక్కిన సినిమా ఏలుమలై. లవ్, ఫ్యామిలీ, యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఏలుమలై టీజర్ను కన్నడ స్టార్ హీరో, కరుణాడ చక్రవర్తిగా పిలిచే శివరాజ్ కుమార్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
రవితేజ కెరీర్లో ఇడియట్ సినిమా ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. ఇడియట్ సినిమాతో హీరోయిన్గా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది రక్షిత. హీరోయిన్ రక్షిత సోదరుడు రాన్న ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఏలుమలై. ఇందులో ప్రియాంక ఆచార్ హీరోయిన్గా చేయగా సీనియర్ హీరో జగపతి బాబు మరో ప్రధాన పాత్ర పోషించారు.
రవితేజ ఇడియట్ హీరోయిన్ రక్షిత సోదరుడు హీరోగా ఏలుమలై- పూరి జగన్నాథ్తో టీజర్, కన్నడ హీరో శివరాజ్ కుమార్తో పోస్టర్ రిలీజ్
యథార్థ సంఘటనల ఆధారంగా
తరుణ్ కిషోర్ సుధీర్ నిర్మాణంలో పునీత్ రంగస్వామి తెరకెక్కించిన సినిమానే ‘ఏలుమలై’. నరసింహా నాయక్ (రాజు గౌడ) సమర్పణలో తరుణ్ సుధీర్ క్రియేటివ్స్, డీఈ ఆర్ట్ స్టూడియోస్ బ్యానర్లపై యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
బెంగళూరులో గ్రాండ్ ఈవెంట్
ఏలుమలై మూవీ టైటిల్ టీజర్ను గురువారం (జులై 11) రిలీజ్ చేశారు. ఈ మేరకు బెంగళూరులోని ఓరియన్ మాల్లో గ్రాండ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ టీజర్ను కరుణాడ చక్రవర్తి, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఆవిష్కరించారు.
పూరి జగన్నాథ్తో టీజర్
డేరింగ్ అండ్ డాషింగ్ పూరి జగన్నాథ్ ఏలుమలై టీజర్ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు, నటుడు, హీరోయిన్ రక్షిత భర్త జోగి ప్రేమ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
శివరాజ్ కుమార్ కామెంట్స్
ఏలుమలై టైటిల్ టీజర్ లాంచ్ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ .. "టీజర్ అద్భుతంగా ఉంది. మంచి వ్యక్తులకు మంచి జరుగుతుందని టైటిల్ టీజర్ రుజువు చేస్తుంది" అని అన్నారు.
"రాన్నా చాలా గొప్పగా నటించాడనిపిస్తోంది. ప్రియాంక అస్సలు కొత్త అమ్మాయిలా అనిపించలేదు. కొత్తవారు, న్యూ టాలెంట్ వచ్చి కొత్త చిత్రాల్ని తీయాలి. ఇలాంటి కొత్త వారిని ఆడియెన్స్ ఆదరించి, విజయాన్ని చేకూర్చాలి" అని శివరాజ్ కుమార్ తెలిపారు.
హీరోయిన్ భర్త కామెంట్స్
రక్షిత భర్త జోగి ప్రేమ్ మాట్లాడుతూ .. "జోగి షూటింగ్ సమయంలో శివన్నతో కలిసి పని చేశాను. ఆయన చాలా మంచి వారు. ఆయన చేతుల మీదుగా టీజర్ రిలీజ్ అవ్వడం ఆనందంగా ఉంది. టీమ్కు గొప్ప విజయం దక్కాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.
ఏలుమలై నటీనటులు
ఇదిలా ఉంటే, ఈ సినిమాను కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని చామరాజనగర్, సేలం, ఈరోడ్ వంటి వివిధ ప్రదేశాలలో చిత్రీకరించారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ భాషలలో ఏకకాలంలో విడుదల కానుంది. ఇందులో రాన్నా, ప్రియాంక ఆచార్, జగపతి బాబుతోపాటు నాగభరణ, కిషోర్ కుమార్, సర్దార్ సత్య, జగప్ప తదితరులు నటించారు.