RGV: నా కొత్త గురువు ఆదిత్య ధర్.. నా సిండికేట్ సినిమా అతనికే అంకితం: రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్
RGV: ధురంధర్ 2 సినిమాపై రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆ సినిమా డైరెక్టర్ ఆదిత్య ధర్ తన కొత్త గురువు అంటూ అతనికి తన నెక్ట్స్ మూవీ సిండికేట్ ను అంకితమిస్తున్నట్లు ట్వీట్ చేశాడు.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, టాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సామాన్య ప్రేక్షకుల నుంచి స్టార్ హీరోల వరకు అందరూ ఈ సినిమా మానియాలో మునిగిపోయారు.

ఇప్పుడు ఈ లిస్ట్లో ఇండియన్ సినిమా గతిని మార్చిన లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా చేరిపోయాడు. ధురంధర్ ద రివెంజ్ సినిమా చూసిన వర్మ, ఈ సినిమా తన మీద ఎంత బలమైన ముద్ర వేసిందో చెబుతూ ఎక్స్ ప్లాట్ఫామ్లో ఒక అదిరిపోయే పోస్ట్ పెట్టాడు. అసలు ఆ పోస్ట్లో ఏముందో, అతడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఏం చెప్పాడో ఇక్కడ వివరంగా మాట్లాడుకుందాం.
పాత రోజులు వదిలేసి కొత్త దారిలో వర్మ..
ఎప్పుడూ తనదైన స్టైల్లో కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే ఆర్జీవీ.. ఈసారి ధురంధర్ 2 ఇంపాక్ట్ తన మీద చాలా గట్టిగా పడిందని చెప్పాడు. గతాన్ని వదిలేసి సరికొత్త భవిష్యత్తును క్రియేట్ చేసుకునే ప్రాసెస్లో తాను ఒక గట్టి నిర్ణయం తీసుకున్నట్లు అతడు స్పష్టం చేశాడు.
హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలాను వర్మ ఎప్పుడూ తన ఇన్స్పిరేషన్గా, తన గురువుగా భావిస్తుంటాడు అన్న సంగతి మనకు తెలిసిందే. ఆ పాత గురువు కొప్పోలాకు ఒక నివాళిగా తాను సత్య, కంపెనీ, సర్కార్ లాంటి అద్భుతమైన సినిమాలు తీశానని వర్మ తన ట్వీట్లో గుర్తుచేసుకున్నాడు. ఈ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర గ్యాంగ్స్టర్ డ్రామాలకు ఒక కొత్త బెంచ్మార్క్ క్రియేట్ చేశాయి.
కొత్త గురువు ఆదిత్య ధర్.. కొత్త సినిమా సిండికేట్
అయితే ఇప్పుడు ఆ పాత గురువు ప్లేస్లో తనకు ఒక కొత్త గురువు దొరికాడని ఆర్జీవీ చేసిన కామెంట్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్గా మారింది. ధురంధర్ 2 సినిమాతో ఆదిత్య ధర్ చూపించిన విజన్, అతని డైరెక్షన్ స్కిల్స్ చూసి ఫిదా అయిపోయిన వర్మ.. ఆదిత్యను ఏకంగా తన కొత్త గురువుగా ప్రకటించేశాడు.
అంతేకాదు ఆదిత్య ధర్ మీద ఉన్న విపరీతమైన ఇష్టంతో 'సిండికేట్' అనే ఒక కొత్త సినిమాను కూడా అతడు అఫీషియల్గా అనౌన్స్ చేశాడు. తన పాత గురువు కొప్పోలాకు సత్య, సర్కార్ లాంటి సినిమాలు ఎలాగైతే డెడికేట్ చేశానో.. తాను తీయబోయే ఈ నెక్స్ట్ సినిమా సిండికేట్ను తన కొత్త గురువు ఆదిత్య ధర్కు డెడికేట్ చేస్తున్నట్లు ఆర్జీవీ చాలా ఓపెన్గా చెప్పేశాడు.
ఇప్పటి వరకూ కేవలం మూడే మూడు సినిమాలు తీసిన ఆదిత్య ధర్ ను ఆర్జీవీలాంటి ఎంతో పేరున్న డైరెక్టర్ తన గురువు అంటూ అనౌన్స్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సిండికేట్ సినిమాతో వర్మ మళ్ళీ తన పాత మ్యాజిక్ రిపీట్ చేసి బాక్సాఫీస్ దగ్గర హిట్ కొడతాడేమో అని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


