స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్.. అందనంత ఎత్తులో కార్తీకదీపం.. టాప్ 10 సీరియల్స్ ఇవే
స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. 23వ వారానికి సంబంధించిన ఈ రేటింగ్స్ లో కార్తీకదీపం సీరియల్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉండగా.. టాప్ 10 లోకి మరోసారి మూడు జీ తెలుగు సీరియల్స్ వచ్చాయి.
స్టార్ మా, జీ తెలుగు ఛానెల్స్ లో వచ్చే తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. ఎప్పటిలాగే కార్తీకదీపం ఈ వారం కూడా టాప్ లో నిలిచింది. అంతేకాదు తన రేటింగ్ ను మరింత మెరుగుపరచుకొని రెండో స్థానంలో ఉన్న సీరియల్ కు అందనంత ఎత్తుకు చేరింది. మరి 23వ వారంలో టాప్ 10 తెలుగు సీరియల్స్ ఏవో ఒకసారి చూద్దాం.

స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
ఈ ఏడాది 23వ వారానికి సంబంధించిన స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. కార్తీకదీపం 2 సీరియల్ టాప్ లోనే కొనసాగుతోంది. అయితే ఈసారి ఆ సీరియల్ రేటింగ్ ఏకంగా 13.16కు చేరడం విశేషం. రెండో స్థానంలో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కు 12.16 రేటింగ్ రాగా.. దానికంటే చాాలా ఎత్తున కార్తీకదీపం నిలిచింది. ఇక మూడోస్థానంలో ఇంటింటి రామాయణం సీరియల్ 12.02 రేటింగ్ సాధించింది. ఈ సీరియల్ రేటింగ్ కూడా 23వ వారం మెరుగైంది.
నాలుగో స్థానంలో గుండెనిండా గుడిగంటలు సీరియల్ ఉంది. దీనికి ఈ వారం 11.76 రేటింగ్ వచ్చింది. ఐదో స్థానంలో చిన్ని కొనసాగుతోంది. ఈ వారం కాస్త మెరుగ్గా 8.42 రేటింగ్ సాధించినా.. ఆరోస్థానంలో ఉన్న నువ్వుంటే నా జతగా సీరియల్ నుంచి ముప్పు తప్పడం లేదు. ఆ సీరియల్ కు 8.36 రేటింగ్ నమోదైంది. ఇక బ్రహ్మముడి 7.23 రేటింగ్ తో ఏడో స్థానంలో ఉంది.
జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
తెలుగు సీరియల్స్ 23వ వారం రేటింగ్స్ లో టాప్ 10లో మరోసారి మూడు జీ తెలుగు సీరియల్స్ చోటు సంపాదించాయి. అయితే ఇందులో ఒక్క సీరియల్ రేటింగ్ కూడా కనీసం 7 దాటలేదు. అత్యధికంగా జగద్ధాత్రి సీరియల్ కు 6.75 రేటింగ్ నమోదైంది. ఈ సీరియల్ ఓవరాల్ గా 8వ స్థానంలో నిలిచింది.
ఇక ఆ తర్వాత మేఘ సందేశం 6.68, చామంతి 6.59 రేటింగ్స్ సాధించి టాప్ 10లో చోటు సంపాదించాయి. లక్ష్మీ నివాసం 5.61, అమ్మాయిగారు 4.59 రేటింగ్స్ సాధించాయి. స్టార్ మాతో పోలిస్తే మాత్రం జీ తెలుగు చాలా వెనుకబడే ఉందని చెప్పాలి. ఈవారం టాప్ 10లో మూడు సీరియల్స్ ఉండటమే జీ తెలుగుకు కాస్త ఊరట కలిగించే విషయం.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



