Sunil Grover Rohit Sharma: ఫన్నీగా నెట్‌ఫ్లిక్స్ యాడ్.. రోహిత్ శర్మను అనుకరించిన కమెడియన్.. అచ్చూ హిట్‌మ్యాన్‌లాగే..

Sunil Grover Rohit Sharma: రోహిత్ శర్మగా మారిపోయాడు ప్రముఖ కమెడియన్ సునీల్ గ్రోవర్. ముంబై ఇండియన్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ క్రియేట్ చేసిన యాడ్ లో అచ్చూ హిట్‌మ్యాన్ ను అనుకరిస్తూ సునీల్ చేసిన కామెడీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Published on: Apr 10, 2026, 22:22:00 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sunil Grover Rohit Sharma: తన అద్భుతమైన టైమింగ్‌తో, మిమిక్రీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే సునీల్ గ్రోవర్ మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'లో సల్మాన్ ఖాన్ నుంచి ఉదిత్ నారాయణ్ వరకు అందరినీ ఇమిటేట్ చేసి మెప్పించిన సునీల్.. ఈసారి టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను అచ్చుగుద్దినట్లు దించేశారు. నెట్‌ఫ్లిక్స్ కోసం చేసిన ఒక కొత్త అడ్వర్టైజ్‌మెంట్‌లో రోహిత్ శర్మ 'బిందాస్' స్టైల్‌ను అనుకరించి నెటిజన్లను ఫిదా చేశారు.

Sunil Grover Rohit Sharma: ఫన్నీగా నెట్‌ఫ్లిక్స్ యాడ్.. రోహిత్ శర్మను అనుకరించిన కమెడియన్.. అచ్చూ హిట్‌మ్యాన్‌లాగే..
Sunil Grover Rohit Sharma: ఫన్నీగా నెట్‌ఫ్లిక్స్ యాడ్.. రోహిత్ శర్మను అనుకరించిన కమెడియన్.. అచ్చూ హిట్‌మ్యాన్‌లాగే..

నెట్‌ఫ్లిక్స్ యాడ్‌లో ఏం జరిగింది?

ముంబై ఇండియన్స్ జెర్సీ ధరించి, రోహిత్ శర్మలాగే నడుచుకుంటూ సెట్‌లోకి అడుగుపెడతారు సునీల్ గ్రోవర్. రోహిత్ మాట్లాడే తీరు, స్పందించే పద్ధతిని ఆయన అద్భుతంగా క్యాచ్ చేశారు. యాడ్ షూట్ చేస్తున్న దర్శకుడికి సునీల్‌ను చూసి.. ఇది ఒరిజినల్ రోహిత్ శర్మ కాదని, ఏమైనా AI హ్యాండ్ ఉందా అనే అనుమానం కలుగుతుంది.

రోహిత్ శర్మ తరహాలోనే డైలాగ్స్ చెబుతూ మధ్యలో తడబడటం, ముంబై ఇండియన్స్‌కు నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్ ఎంటర్‌టైన్‌మెంట్ పార్టనర్ అని చెప్పడం నవ్వులు పూయిస్తుంది.

యాడ్ ముగింపులో అసలు రోహిత్ శర్మ స్క్రీన్ మీద కనిపిస్తూ.. నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా చూస్తూ "ఈరోజు నాకు యాడ్ షూట్ ఉందా?" అని అడగడం హైలైట్‌గా నిలిచింది.

నెటిజన్ల రియాక్షన్.. "రోహిత్ కంటే బుమ్రాలా ఉన్నావేంటి?"

ఈ వీడియో వైరల్ కావడంతో అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.

"నువ్వు రోహిత్ కంటే జస్ప్రీత్ బుమ్రాలా ఎక్కువగా కనిపిస్తున్నావు.. త్వరలోనే ఆయన మిమిక్రీ కూడా చేయి పంజాబీ!" అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.

"AI కూడా సునీల్ టాలెంట్‌ను మ్యాచ్ చేయలేదు.. అదిరిపోయింది!" అని మరొకరు ప్రశంసించారు.

"సునీల్ గ్రోవర్ గ్రేట్.. ఆ మూమెంట్స్ చూస్తుంటే నిజంగా రోహితే అనుకున్నాం" అంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.

మిమిక్రీలో మేటి.. సునీల్ గ్రోవర్

గతంలో గుత్తి (Gutthi), డాక్టర్ మషూర్ గులాటి వంటి పాత్రలతో గుర్తింపు పొందిన సునీల్.. ఇప్పుడు ఆ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి దిగ్గజాలను అనుకరించడంలో తన మార్కు చూపిస్తున్నారు. ఇటీవల ఆయన చేసిన గుల్జార్ మిమిక్రీకి ఇంటర్నెట్ ఫిదా అయింది.

ఆయన ప్రతిభను నటుడు గజరాజ్ రావు కూడా మెచ్చుకుంటూ.. "సునీల్ స్టేజ్ మీద కపిల్ దేవ్‌గా మారితే, నిజమైన కపిల్ దేవ్ కూడా ఆశ్చర్యంగా చూస్తారు. ఆయన రాజమౌళి అయినా, అమీర్ ఖాన్ అయినా.. ఆ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేస్తారు" అని కొనియాడారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. సునీల్ గ్రోవర్ ఏ క్రికెటర్‌ను మిమిక్రీ చేశారు?

నెట్‌ఫ్లిక్స్ యాడ్ కోసం సునీల్ గ్రోవర్ భారత క్రికెటర్ రోహిత్ శర్మను మిమిక్రీ చేశారు.

2. సునీల్ గ్రోవర్ యాడ్ ఏ జట్టుకు సంబంధించింది?

ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ (MI) కు నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్ ఎంటర్‌టైన్‌మెంట్ పార్టనర్‌గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ యాడ్‌ను రూపొందించారు.

3. సునీల్ గ్రోవర్ పాత పాత్రలు ఏమిటి?

కపిల్ శర్మ షోలలో ఆయన పోషించిన గుత్తి (Gutthi), డాక్టర్ మషూర్ గులాటి పాత్రలు అత్యంత ప్రజాదరణ పొందాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More