టీవీలోకి వచ్చేస్తున్న రూ.150 కోట్ల వసూళ్ల బ్లాక్‌బస్టర్ కామెడీ మూవీ.. ప్రీమియర్ డేట్ ఇదే.. ఇక్కడ చూడండి

తమిళ బ్లాక్‌బస్టర్ కామెడీ మూవీ తెలుగులో టీవీ ప్రీమియర్ కు సిద్ధమైంది. వచ్చే ఆదివారమే (జూన్ 8) ఈ సినిమా టెలికాస్ట్ కానుంది. ఇప్పటికే థియేటర్లతోపాటు ఓటీటీలోనూ ఈ మూవీ సత్తా చాటింది.

Published on: Jun 6, 2025, 20:13:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళంతోపాటు తెలుగులోనూ బ్లాక్‌బస్టర్ అయిన రొమాంటిక్ కామెడీ మూవీ డ్రాగన్ (Dragon). ఈ ఏడాది ఫిబ్రవరి 21న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. మార్చిలో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇక సుమారు నాలుగు నెలల తర్వాత టీవీ ప్రీమియర్ కు సిద్ధమైంది. మరి ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ వివరాలు తెలుసుకోండి.

టీవీలోకి వచ్చేస్తున్న రూ.150 కోట్ల వసూళ్ల బ్లాక్‌బస్టర్ కామెడీ మూవీ.. ప్రీమియర్ డేట్ ఇదే.. ఇక్కడ చూడండి
టీవీలోకి వచ్చేస్తున్న రూ.150 కోట్ల వసూళ్ల బ్లాక్‌బస్టర్ కామెడీ మూవీ.. ప్రీమియర్ డేట్ ఇదే.. ఇక్కడ చూడండి

డ్రాగన్ టీవీ ప్రీమియర్ డేట్ ఇదే

తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ నటించిన మూవీ డ్రాగన్. ఈ సినిమా వచ్చే ఆదివారం (జూన్ 8) సాయంత్రం 6 గంటలకు స్టార్ మా ఛానెల్లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని ఆ ఛానెల్ శుక్రవారం (జూన్ 6) వెల్లడించింది. అదే రోజు విజయ్ టీవీలో తమిళ వరల్డ్ టీవీ ప్రీమియర్ కూడా కానుంది.

ఈ మూవీ టెలికాస్ట్ విషయాన్ని వెల్లడిస్తూ.. ఓ చిన్న వీడియోను కూడా పోస్ట్ చేసింది స్టార్ మా ఛానెల్. థియేటర్లు, ఓటీటీలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ డ్రాగన్ మూవీని టీవీల్లోనూ ప్రేక్షకులు ఆదరిస్తారని మేకర్స్ ఆశతో ఉన్నారు.

డ్రాగన్ మూవీ గురించి..

డ్రాగన్ మూవీకి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించాడు. కామెడీతో మెప్పించాడు. ప్రదీప్ రంగనాథన్ మరోసారి తన కామెడీ టైమింగ్, యాక్టింగ్‍తో అదరగొట్టాడు. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కాయదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. కేఎస్ రవి కుమార్, గౌతమ్ మీనన్, స్నేహ, మిస్కిన్, హర్షంత్ ఖాన్, మరియం జార్జ్ కీలకపాత్రలు పోషించారు.

డ్రాగన్ సినిమా సుమారు రూ.37 కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసింది. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి వసూళ్లు వచ్చాయి. డ్రాగన్ మూవీకి ఆరంభం నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. యూత్‍ను విపరీతంగా మెప్పించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ కొట్టేసింది. లవ్ టుడే తర్వాత మరోసారి భారీ సక్సెస్ అందుకున్నాడు ప్రదీప్ రంగనాథన్.

డ్రాగన్ మూవీని ఎజీఎస్ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్‌పై కల్పాతి అఘోరం, కల్పాతి ఎస్ గణేశ్, కల్పాతి ఎస్ సురేశ్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీ నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ మ్యూజిక్ ఇచ్చారు.

డ్రాగన్ మూవీ స్టోరీ ఏంటంటే?

డ్రాగన్ అలియాస్ రాఘవన్ (ప్రదీప్ రంగనాథన్)కు ఇంజినీరింగ్‍లో 48 బ్యాక్‍లాగ్స్ ఉంటాయి. ఈ క్రమంలోనే గర్ల్ ఫ్రెండ్ కీర్తి (అనుపమ పరమేశ్వరన్)తో అతడికి బ్రేకప్ అవుతుంది. తాను జీవితంలో ఉన్నతస్థాయికి వెళతానని కీర్తికి సవాల్ చేస్తాడు రాఘవన్. ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించి మంచి ఉద్యోగం తెచ్చుకుంటాడు.

మరో అమ్మాయి పల్లవి (కాయదు లోహర్)ను ప్రేమించి పెళ్లికి రెడీ అవుతాడు. అంతలోనే కాలేజీ ప్రిన్సిపాల్ రాఘవన్‍కు ఎదురవుతాడు. ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగం తెచ్చుకున్నాడని గుర్తిస్తాడు. కాలేజీలో బ్యాక్‍లాగ్స్ క్లియర్ చేసి పాస్ అవుతావా.. లేదా మోసాన్ని బయటపెట్టి ఉద్యోగం పోయేలా చేయాలా అని రాఘవన్‍ను హెచ్చరిస్తాడు.

దీంతో మళ్లీ కాలేజీలోకి రాఘవన్ ఎంటర్ అవుతాడు. మరి అన్ని సబ్జెక్టుల్లో రాఘవన్ పాసయ్యాడా.. పల్లవిని పెళ్లి చేసుకున్నాడా.. ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది డ్రాగన్ చిత్రంలో ప్రధానమైన అంశాలుగా ఉంటాయి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More