తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ డీఎన్ఏ (DNA) ఓటీటీలోకి వచ్చేస్తోంది. 'ఫర్హానా', 'మాన్స్టర్' వంటి సినిమాలతో పేరుగాంచిన దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ రూపొందించిన ఈ సినిమా జూన్ 20, 2025న థియేటర్లలో విడుదలైంది. అథర్వ మురళి, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ థియేట్రికల్ రిలీజ్ కాకముందే జియోహాట్స్టార్ తో ఓటీటీ డీల్ ఖరారు చేసుకుంది.
'DNA' ఓటీటీ రిలీజ్ డేట్

థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ సాధించిన మూవీ డీఎన్ఏ. ఈ 'DNA' స్ట్రీమింగ్ అరంగేట్రం కోసం జియోహాట్స్టార్ ఇప్పుడు తేదీని ఖరారు చేసింది. శనివారం (జులై 19) నుండి ఈ మూవీ జియోహాట్స్టార్ లో అందుబాటులోకి రానుంది. తమిళంతో పాటు మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
నెల్సన్ వెంకటేశన్, అతిషా వినో కలిసి కథ అందించిన ఈ మూవీలో మొహమ్మద్ జీషన్ అయ్యుబ్, బాలాజీ శక్తివేల్, రమేష్ తిలక్, విజి చంద్రశేఖర్, చేతన్, రిత్విక, తెండ్రల్ రఘునాథన్, ఐశ్వర్య రఘుపతి, మానస చౌదరి, సుబ్రమణ్యం శివ, కరుణాకరన్ వంటి పలువురు నటీనటులు నటించారు.
ఒలింపియా మూవీస్ బ్యానర్పై జయంతి అంబేత్కుమార్, ఎస్ అంబేత్కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సత్యప్రకాష్, శ్రీకాంత్ హరిహరన్, ప్రవీణ్ సాయివి, సాహి శివ, అనల్ ఆకాష్ సంగీతం అందించగా, జిబ్రాన్ వైభోద బీజీఎం సమకూర్చారు. పార్థిబన్ సినిమాటోగ్రఫీ అందించారు.
'DNA' స్టోరీ ఏంటంటే?
ఈ మూవీ ఆనంద్ (అథర్వ), దివ్య (నిమిషా) అనే యువ దంపతుల కథను చూపిస్తుంది. తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న వీరికి, పుట్టిన బిడ్డ తమది కాదని తెలిసినప్పుడు ఎదురయ్యే కష్టాలు ఈ సినిమా కథాంశం.
హాస్పిటల్ ఎటువంటి తప్పును అంగీకరించకపోయినా, బిడ్డకు సంబంధించిన DNA ఆధారాలు.. ఆనంద్, దివ్యకు అప్పగించిన బిడ్డ తమకు పుట్టినది కాదని స్పష్టం చేస్తాయి. దీంతో తమ బిడ్డ కిడ్నాప్ వెనుక ఉన్న అసలు కారణాలను ఛేదించాల్సి వస్తుంది.
{{/usCountry}}హాస్పిటల్ ఎటువంటి తప్పును అంగీకరించకపోయినా, బిడ్డకు సంబంధించిన DNA ఆధారాలు.. ఆనంద్, దివ్యకు అప్పగించిన బిడ్డ తమకు పుట్టినది కాదని స్పష్టం చేస్తాయి. దీంతో తమ బిడ్డ కిడ్నాప్ వెనుక ఉన్న అసలు కారణాలను ఛేదించాల్సి వస్తుంది.
{{/usCountry}}మలయాళ నటి నిమిషా సజయన్ 'చిత్తా' చిత్రంతో తమిళ సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత 'మిషన్: చాప్టర్ 1', 'జిగర్తాండా డబుల్ఎక్స్' వంటి చిత్రాలలో నటించింది. 'లంత్రాని' (ఆంథాలజీ), 'పోచర్', 'డబ్బా కార్టెల్' వంటి వెబ్ షోలతో హిందీలో కూడా అడుగుపెట్టింది.
అథర్వ చివరిగా కార్తీక్ నరేన్ 'నిరంగల్ మూంద్రు' చిత్రంలో కనిపించాడు. 'DNA' ఈ ఏడాది అతనికి మొదటి రిలీజ్. ఈ నటుడు త్వరలో 'అడ్రస్', 'పరాశక్తి', 'ఇదయం మురళి' వంటి చిత్రాలలో నటించనున్నారు.