ఓటీటీలోకి వచ్చేసిన తమిళ థ్రిల్లర్.. ఒకే రాత్రిలో జరిగే కథ.. ఫుల్ గా తాగి ట్రాప్ లో పడ్డ ఫ్రెండ్స్.. 9.0 ఐఎండీబీ రేటింగ్

ఓటీటీలోకి తమిళ్ థ్రిల్లర్ మూవీ దూసుకొచ్చింది. డిఫరెంట్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 9.0 రేటింగ్ ఉంది. మద్యం మత్తులో ఒక రాత్రిలో ఆరుగురి స్నేహితుల జీవితాలు ఎలాంటి మలుపు తీసుకున్నాయనే థ్రిల్లింగ్ కథను డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు. ఈ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?

Published on: Jul 17, 2025 5:41 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

డిఫరెంట్ స్టోరీ లైన్.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు తమిళ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న ‘మనిదర్గల్’ మూవీ ఈ రోజు (జూలై 17) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఒకే రాత్రిలో జరిగే కథ ఇది. పీకల దాకా తాగి అనుకోని ప్రమాదంలో చిక్కుకునే ఆరుగురు ఫ్రెండ్స్ స్టోరీ ఇది.

ఓటీటీలోకి తమిళ థ్రిల్లర్ (x/aha Tamil)
ఓటీటీలోకి తమిళ థ్రిల్లర్ (x/aha Tamil)

రెండు ఓటీటీల్లోకి

మే 30న థియేటర్లలో రిలీజైన మనిదర్గల్ (Manidhargal) మూవీ అదరగొట్టింది. డిఫరెంట్ కాన్సెస్ట్ తో విభిన్న ప్రయత్నంగా వచ్చిన ఈ థ్రిల్లర్ సినిమాను ఆడియన్స్ ఆదరించారు. ఈ సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేయడంతో ఐఎండీబీలో ఏకంగా 9.0 రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా గురువారం రెండు ఓటీటీల్లోకి వచ్చేసింది. ఆహా తమిళ్ తో పాటు సన్ నెక్ట్స్ లో కూడా ఈ ఫిల్మ్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. మనిదర్గల్ అంటే మనుషులు అని అర్థం.

వాస్తవ సంఘటనలు

వాస్తవ సంఘటనల ఆధారంగా మనిదర్గల్ మూవీ తెరకెక్కించారు. తమిళ సినీ ఇండస్ట్రీలో ఇదో కొత్త ప్రయత్నంగా నిలిచిపోయింది. ఈ సినిమాకి రామ్ ఇంద్ర దర్శకత్వం వహించారు. సామాజిక స్పృహ కలిగిన చిత్రంగా ఈ మూవీతో డైైరెక్టర్ డిఫరెంట్ గా స్టోరీ చెప్పడానికి ప్రయత్నించారు.

మనిదర్గల్ మూవీ గురించి..

మనిదర్గల్ మూవీ మే 30న థియేటర్లలో రిలీజైంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలే వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. ఈ సినిమా ఆరుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. ఇందులో కపిల్ వేలవన్, దక్ష లీడ్ రోల్స్ లో నటించారు. వీళ్లే కాకుండా గుణవంతన్ ధనపాల్, అర్జున్‌దేవ్ శరవణన్, సాంబ శివమ్ లాంటి వాళ్లు కూడా నటించారు.

ఈ సినిమా మొత్తం ఒక రాత్రి జరిగే స్టోరీ. చాలా వరకు షూటింగ్ కూడా రాత్రి వేళల్లోనే జరిపినట్లు కనిపిస్తుంది. ఆరుగురు స్నేహితులు ఓ రాత్రి పార్టీ అంటూ పీకలదాకా తాగుతారు. ఆ తర్వాత వాళ్ల జీవితాలు మారిపోతాయి. ఓ ఊహించని ఘటన జరుగుతుంది. దీంతో వాళ్లు ఒకరిపై మరొకరు అనుమానం వ్యక్తం చేసుకుంటారు.

అసలు ఏం జరిగింది? ఆ తర్వాత వాళ్ల జీవితాలు ఏమయ్యాయి అన్నది ఈ సినిమాలో చూడొచ్చు. ఐఎండీబీలో 9.0 రేటింగ్ సాధించిన సినిమాకు ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. ఈ తమిళ థ్రిల్లర్ మనిదర్గల్ ఆహా తమిళం, సన్ నెక్ట్స్ ఓటీటీల్లో గురువారం (జులై 17) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.