ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్.. ఐఎండీబీలో 9.5 రేటింగ్.. రెండున్నర నెలల తర్వాత స్ట్రీమింగ్

ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా రెండున్నర నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ మూవీకి ఐఎండీబీలో ఏకంగా 9.5 రేటింగ్ ఉండటం విశేషం.

Published on: Jun 30, 2025 9:25 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి రవితేజ మేనల్లుడు నటించిన మూవీ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ సినిమా పేరు జగమెరిగిన సత్యం. తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజ్ కాగా.. మొత్తానికి రెండున్నర నెలల తర్వాత ఈ వారమే ఓటీటీలోకి వస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడాలి? అసలు కథేంటి అన్న వివరాలు ఇక్కడ చూడండి.

ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్.. ఐఎండీబీలో 9.5 రేటింగ్.. రెండున్నర నెలల తర్వాత స్ట్రీమింగ్
ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్.. ఐఎండీబీలో 9.5 రేటింగ్.. రెండున్నర నెలల తర్వాత స్ట్రీమింగ్

జగమెరిగిన సత్యం ఓటీటీ రిలీజ్ డేట్

తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్మూవీ జగమెరిగిన సత్యం. ఈ సినిమా వచ్చే శుక్రవారం (జులై 4) నుంచి సన్ నెక్ట్స్ (Sun NXT) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని సోమవారం (జూన్ 30) ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

“అహంకారంతో నడిచే ఓ ఊళ్లో ఒక వ్యక్తి ప్రేమ అతని అతిపెద్ద తిరుగుబాటు అయింది. జగమెరిగిన సత్యం.. జులై 4 నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.

జగమెరిగిన సత్యం మూవీ స్టోరీ ఏంటంటే?

జగమెరిగిన సత్యం సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజైంది. ఐఎండీబీలో ఏకంగా 9.5 రేటింగ్ సొంతం చేసుకుంది. అయితే బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు. ఇదో రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో వచ్చిన మరో సినిమా. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండే దిండ అనే గ్రామంలో 1994లో జరిగిన కథగా సాగుతుంది.

ఈ సినిమాలో సత్యం అనే పాత్రలో రవితేజ మేనల్లుడు అవినాశ్ వర్మ నటించాడు. సత్యం, సరిత ప్రేమ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. సర్పంచ్ మేనకోడలైన సరితను సత్యం ప్రేమించడం ఆ ఊళ్లో పెద్ద దుమారమే రేపుతుంది. తిరుపతి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను విజయ భాస్కర్ నిర్మించాడు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించాడు.

అవినాశ్ వర్మతోపాటు ఆద్యరెడ్డి, నీలిమ, వాసుదేవరావు, నితిన్ భోగరాజు లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపని ఈ జగమెరిగిన సత్యం మూవీ ఇప్పుడు సన్ నెక్ట్స్ ఓటీటీలోకి జులై 4న అడుగుపెట్టబోతోంది.

News/Entertainment/ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్.. ఐఎండీబీలో 9.5 రేటింగ్.. రెండున్నర నెలల తర్వాత స్ట్రీమింగ్
News/Entertainment/ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్.. ఐఎండీబీలో 9.5 రేటింగ్.. రెండున్నర నెలల తర్వాత స్ట్రీమింగ్