...
...
Next Story

Thandel Bujji Thalli Song Lyrics: తండేల్ బుజ్జి తల్లి సాంగ్ లిరిక్స్ ఇవే.. మనసుకు హత్తుకునే మెలోడీ సాంగ్ విన్నారా?

Thandel Bujji Thalli Song Lyrics: తండేల్ మూవీ నుంచి బుజ్జి తల్లి అనే మనసుకు హత్తుకునే ఓ మెలోడియస్ సాంగ్ గురువారం (నవంబర్ 21) రిలీజైంది. సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య ఉన్న బంధాన్ని చాటేలా సాగే ఈ పాట లిరిక్స్ ఇక్కడ చూడండి.

Published on: Nov 21, 2024, 21:11:43 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

Thandel Bujji Thalli Song Lyrics: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న మూవీ తండేల్. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా బుజ్జి తల్లి అంటూ సాగిపోయే లిరికల్ వీడియో రిలీజైంది. గురువారం (నవంబర్ 21) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మెలోడీ సాంగ్ ఇన్‌స్టాంట్ హిట్ అయింది.

మనసుకు హత్తుకునే మెలోడీ

తండేల్ బుజ్జి తల్లి సాంగ్ లిరిక్స్ ఇవే.. మనసుకు హత్తుకునే మెలోడీ సాంగ్ విన్నారా?
తండేల్ బుజ్జి తల్లి సాంగ్ లిరిక్స్ ఇవే.. మనసుకు హత్తుకునే మెలోడీ సాంగ్ విన్నారా?

తండేల్ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. తన కెరీర్లో ఎన్నో హిట్ మెలోడీ సాంగ్స్ అందించిన అతడు.. తాజాగా ఈ తండేల్ మూవీలో కూడా బుజ్జి తల్లి అంటూ సాగిపోయే ఈ పాటను క్రియేట్ చేశాడు.

నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య మూవీలో సాగే ఎమోషనల్ జర్నీని కళ్లకు కట్టేలా ఈ పాట సాగిపోయింది. ప్రియురాలికి దూరమైన ప్రియుడు విరహ వేదనతోపాటు ఆమెకు బుజ్జగించేలా సాగిపోయే అద్భుతమైన పాట ఇది.

చాలా కాలం పాటు మెలోడీ లవర్స్ మనసుల్లో నిలిచేపోయే పాటను దేవిశ్రీ ప్రసాద్ అందించాడని చెప్పొచ్చు. లిరికల్ వీడియోలో చైతూ, పల్లవి మధ్య బంధాన్ని కళ్లకు కట్టేలా ఈ పాటను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

సముద్రం సాక్షిగా ఓ యదార్థ ప్రేమకథ అంటూ ఈ వీడియో ప్రారంభమైంది. శ్రీమణి ఈ పాటకు లిరిక్స్ అందించగా.. బాలీవుడ్ సింగర్ జావెద్ అలీ పాడాడు. పుష్ప మూవీలో హిందీ వెర్షన్ శ్రీవల్లి పాట పాడింది ఇతడే. మరి అలాంటి పాట లిరిక్స్ ఇక్కడ చూడండి.

బుజ్జి తల్లి సాంగ్ లిరిక్స్

గాలిలో ఊగిసలాడే దీపంలా..

ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం..

చీకటి కమ్మెను నీ కబురందక నా లోకం..

సుడిగాలిలో పడిపడి లేచే..

పడవల్లే తడబడుతున్నా..

నీకోసం.. వేచుందే.. నా ప్రాణం..

ఓ బుజ్జితల్లీ.. నా కోసం.. ఓ మాటైనా మాటాడే..

నా బుజ్జితల్లీ...

నీరు లేని చేపల్లే..

తార లేని నింగల్లే..

జీవమేది నాలోనా..

నువ్వు మాటలాడందే..

మళ్లీ యాలకొస్తానే..

కాళ్లయేళ్ల పడతానే..

లెంపలేసుకుంటానే..

ఇంక నిన్ను యిడిపోనే..

ఉప్పు నీటి ముప్పుని కూడా..

గొప్పగ దాటే గట్టోన్నే..

నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే..

నీకోసం.. వేచుందే.. నా ప్రాణం..

ఓ బుజ్జితల్లీ.. నా కోసం.. ఓ మాటైనా మాటాడే..

నా బుజ్జితల్లీ...

ఇన్నినాళ్ల మన దూరం..

తియ్యనైన ఓ విరహం..

చేదులాగా మారిందే..

అందిరాక నీ గారం..

దేన్ని కానుకియ్యాలే..

ఎంత బుజ్జగించాలే..

బెట్టు నువ్వు దించేలా..

లంచమేటి కావాలే..

గాలివాన జాడే లేదే..

రవ్వంతైనా నా చుట్టూ..

అయినా మునిగిపోతున్నానే..

దారే చూపెట్టు..

నీకోసం.. వేచుందే.. నా ప్రాణం..

ఓ బుజ్జితల్లీ.. నా కోసం.. ఓ మాటైనా మాటాడే..

నా బుజ్జితల్లీ...

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe