అదిరిపోయిన సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. రాజీవ్ గాంధీ హంతకుల వేట ఎలా సాగిందో చూస్తారా.. ఈ వీకెండ్ మస్ట్ వాచ్
ఈ వీకెండ్ మంచి సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూడాలనుకుంటున్నారా? అయితే సోనీ లివ్ ఓటీటీలో ఉన్న ది హంట్ ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ మిస్ కాకుండా చూడండి. మాజీ ప్రధాని హంతకుల వేట ఎలా సాగిందో కళ్లకు కట్టినట్లు చూపించిన తీరు అద్భుతం.
స్వతంత్ర భారత చరిత్రలో జరిగిన పెను విషాదాల్లో ఒకటి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య. అయితే ఆ హత్య కేసులో అసలు నిందితులను కేవలం 90 రోజుల్లోనే పట్టుకోవడం అనేది మరో రికార్డు. అలా రాజీవ్ హంతకుల వేట ఎలా సాగిందో కళ్లకు కట్టడానికి ఇప్పుడు ది హంట్ ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ ( The Hunt: The Rajiv Gandhi Assassination Case) వెబ్ సిరీస్ వచ్చింది. సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

వెబ్ సిరీస్: ది హంట్ ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్
డైరెక్టర్: నగేష్ కుకునూర్
నటీనటులు: అమిత్ సియాల్, భాగవతి పెరుమాల్, గిరీష్ శర్మ, ఆపేక్ష అయ్యర్, గౌరీ మేనన్ తదితరులు
ఓటీటీ: సోనీ లివ్
ది హంట్ ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ స్టోరీ ఇదీ..
మే 21, 1991.. ఈ దేశం మెచ్చిన ప్రధానమంత్రుల్లో ఒకరైన రాజీవ్ గాంధీని కోల్పోయిన రోజు అది. తమిళనాడులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఓ ఎల్టీటీఈ ఉగ్రవాది మానవ బాంబుగా మారి రాజీవ్ ను హత్య చేస్తుంది. ది హంట్ వెబ్ సిరీస్ కూడా సరిగ్గా అక్కడే మొదలవుతుంది.
ఆ తర్వాత ఏడు ఎపిసోడ్ల పాటు రాజీవ్ హంతకుల వేట ఎలా సాగింది? 90 రోజుల్లోనే ఈ కేసును ఎలా ఛేదించారు? ఈ హత్య కోసమే శ్రీలంకలోని జాఫ్నా నుంచి ఇండియాకు వచ్చిన 9 మంది ఎల్టీటీఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ పట్టుకుందా? రాజీవ్ హత్యలో మాస్టర్ మైండ్ అయిన వ్యక్తిని ప్రాణాలతో పట్టుకోలేకపోవడానికి కారణమేంటి? అన్నదే ఈ ది హంట్ ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ వెబ్ సిరీస్ స్టోరీ.
అనిరుద్య మిత్రా రాసిన 90 డేస్: ద ట్రూ స్టోరీ ఆఫ్ ద హంట్ ఫర్ రాజీవ్ గాంధీ అసాసిన్స్ అనే బుక్ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించారు. ఇది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లీడ్ చేసిన కార్తికేయన్ (అమిత్ సియాల్), అతని టీమ్ సాగించిన వేటను కళ్లకు కట్టింది.
ది హంట్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
చారిత్రక ఘటనలు.. ముఖ్యంగా సంచలనం రేపిన, వివాదాలకు తావున్న కథాంశాలతో సినిమా లేదా వెబ్ సిరీస్ తెరకెక్కించడం కత్తి మీద సాములాంటిదే. కానీ ది హంట్: ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ వెబ్ సిరీస్ తో ఆ సవాలును మన హైదరాబాదీ డైరెక్టర్ నగేష్ కుకునూర్ స్వీకరించాడు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసు, దానిని 90 రోజుల్లోనే పరిష్కరించిన తీరును 7 ఎపిసోడ్ల ఈ సిరీస్ లో నగేష్ కుకునూర్ అద్భుతంగా చూపించాడు. కేసు దర్యాప్తు సందర్భంగా తెర వెనుక జరిగిన రాజకీయాలు, కుట్ర సిద్ధాంతాలను సున్నితంగా చూపించే ప్రయత్నం చేశారు. ఓ గ్రిప్పింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లో ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి.
ఏడు ఎపిసోడ్ల థ్రిల్లర్
ది హంట్: ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ వెబ్ సిరీస్ మే 21, 1991న రాజీవ్ గాంధీ హత్యకు కొన్ని గంటల ముందు ప్రారంభమవుతుంది. కొలంబోలోని ఇండియన్ హైకమిషన్ ఆఫీసుకు రాజీవ్ గాంధీ బతికే ఉన్నాడా అంటూ ఓ కాల్ వస్తుంది. కానీ ఆ కాల్ ను అక్కడి వాళ్లు తేలిగ్గా తీసుకుంటారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీని ఓ మానవ బాంబు హత్య చేసిన విధానం, దీనిని దర్యాప్తు చేయడానికి ఓ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ఏర్పాటు కావడం, దీని వెనుక ఎల్టీటీఈ హస్తం ఉందని తెలుసుకోవడం, నిందితుల వేట.. ఇలా సాగిపోతుంది.
రాజీవ్ గాంధీని కాపాడుకోవడంలో జరిగిన పొరపాట్ల నుంచి చివరికి అసలు నిందితుడు శివరాసన్ ను పట్టుకోవడంలో ఎలా విఫలమయ్యారన్నది కూడా డైరెక్టర్ నగేష్ కుకునూర్ ఈ వెబ్ సిరీస్ లో చూపించాడు. మొత్తంగా 7 ఎపిసోడ్ల పాటు ఎక్కడా గాడి తప్పకుండా, సీట్లకు అతుక్కుపోయి బింజ్ వాచ్ చేసేలా ఈ సిరీస్ తెరకెక్కించారని చెప్పొచ్చు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper













