The Paradise Teaser: ది ప్యారడైజ్ టీజర్.. కాకులు తల్వార్లు పడితే ఏమైతది.. జడల్ జమానా షురూ.. రక్తపుటేరులు పారించిన నాని

The Paradise Teaser: ది ప్యారడైజ్ టీజర్ వచ్చేసింది. నాని రక్తపుటేరులు పారించాడు. జడల్ జమానా షురూ అంటూ రచ్చ రేపాడు. ఇంతకుముందు ఎప్పుడూ చూడని మాస్ అవతార్ లో నేచురల్ స్టార్ నటన మరో లెవెల్ లో ఉండబోతోందని టీజర్ చూస్తేనే తెలుస్తోంది.

Published on: Aug 6, 2026, 18:45:00 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

The Paradise Teaser: నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ది ప్యారడైజ్ మూవీ టీజర్ ను గురువారం (ఆగస్ట్ 6) సాయంత్రం మేకర్స్ రిలీజ్ చేశారు. ఊహించినట్లే ఊర మాస్ విజువల్స్ తో టీజర్ నాని అభిమానులకు కిక్కెక్కించేలా ఉంది. జడల్ జమనా షురూ అంటూ వచ్చిన ఈ టీజర్ సినిమా రిలీజ్ డేట్ ను కూడా కన్ఫమ్ చేసింది.

The Paradise Teaser: ది పారడైజ్ టీజర్.. కాకులు తల్వార్లు పడితే ఏమైతది.. జడల్ జమానా షురూ.. రక్తపుటేరులు పారించిన నాని
The Paradise Teaser: ది పారడైజ్ టీజర్.. కాకులు తల్వార్లు పడితే ఏమైతది.. జడల్ జమానా షురూ.. రక్తపుటేరులు పారించిన నాని

ది ప్యారడైజ్ టీజర్

రక్తంతో తడిసిన దేహంతో నాని చెప్పే దిష్టి మంత్రం, వెన్నులో వణుకు పుట్టించే యాక్షన్ ఎపిసోడ్స్ తో వచ్చిన ది ప్యారడైజ్ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాను పూర్తిగా షేక్ చేస్తున్నాయి.

'దసరా' లాంటి ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నాని, శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో 'ది ప్యారడైజ్' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా విడుదల చేసిన 1 నిమిషం 43 సెకన్ల టీజర్ ప్రతి ఫ్రేమ్‌లోనూ డైరెక్టర్ విజన్, రా అండ్ రస్టిక్ వైలెన్స్ క్లియర్‌గా కనిపిస్తోంది.

టీజర్ ప్రారంభంలో ఒక గ్యాంగ్‌స్టర్ సెటప్, భారీ వర్షం మధ్య బ్యాక్‌గ్రౌండ్‌లో రౌడీ మూకల గర్జనలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. దానికి తోడు "ఇరుగు దిష్టి పొరుగు దిష్టి.. కత్తులన్ని కటకట.. నెత్తురంత షిటపట" అంటూ నాని ఒరిజినల్ మాస్ గొంతుతో చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తున్నాయి.

వైలెంట్ అవతార్‌తో షాక్ ఇచ్చిన నేచురల్ స్టార్

నాని గెటప్ విషయానికొస్తే.. జడలు కట్టిన జుట్టు, ఒంటినిండా రక్తం, కళ్ళలో ఉగ్రరూపంతో మునుపెన్నడూ లేని సరికొత్త అవతార్‌లో కనిపిస్తున్నారు. చేతిలో గొడ్డలి పట్టుకుని శత్రువుల వేట సాగిస్తూ టీ గ్లాస్ తాగే సీన్ టీజర్‌కే ప్రధాన హైలైట్‌గా నిలిచింది.

శ్రీకాంత్ ఒదెల మేకింగ్ శైలి సాధారణంగా ఇంటెన్స్ కోణంలో సాగుతుంది. 'దసరా'లో గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యాన్ని చూపించిన దర్శకుడు, ఈసారి 'ది ప్యారడైజ్' కోసం మరింత భయంకరమైన డార్క్ వరల్డ్‌ని క్రియేట్ చేసినట్లు స్పష్టమవుతోంది.

అనిరుధ్ మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్

రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్‌ను మరో లెవల్‌కి తీసుకెళ్లింది. అనిరుధ్ అందించిన ఇంటెన్స్ మ్యూజిక్, డ్రమ్స్ బీట్స్ యాక్షన్ సీన్స్ ఎలివేషన్‌ను నెక్స్ట్ లెవల్‌లో నిలబెట్టాయి.

ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. సిహెచ్ సాయి సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్, అవినాష్ కొల్లా సెట్స్ టీజర్‌లో ప్రతి విజువల్‌ని విజువల్ వండర్‌గా ప్రెజెంట్ చేశాయి.

గతంలో 'దసరా' మూవీతో బాక్సాఫీస్ దగ్గర వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ కాంబో, ఈసారి పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. 'సరిపోదా శనివారం', 'హాయ్ నాన్న' లాంటి వరుస హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్న నానికి ఈ సినిమా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మైల్‌స్టోన్‌గా నిలవనుంది.

ఈ భారీ యాక్షన్ డ్రామాను 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More