సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన థగ్ లైఫ్.. తెలుగు సహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్
కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ మూవీ సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో డిజాస్టర్ అయిన ఈ సినిమా ఎలాంటి ముందస్తు అనౌన్స్మెంట్ లేకుండా అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఐదు భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య రిలీజైన థగ్ లైఫ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి అడుగుపెట్టింది. అది కూడా ఎలాంటి ముందస్తు అనౌన్స్మెంట్ లేకుండా బుధవారం (జులై 2) అర్ధరాత్రి దాటగానే స్ట్రీమింగ్ మొదలైంది.

థగ్ లైఫ్ ఓటీటీ స్ట్రీమింగ్
థగ్ లైఫ్ మూవీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ఒరిజినల్ అయిన తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ సౌత్ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
“ఇది రంగరాయ శక్తివేల్, యముడి మధ్య పోటీ. థగ్ లైఫ్ మూవీని ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీల్లో చూడండి” అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది. నిజానికి శుక్రవారం (జులై 4) నుంచి ఈ సినిమా స్ట్రీమింత్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఒక రోజు ముందే రావడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
థగ్ లైఫ్ ఓటీటీ డీల్
థగ్ లైఫ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో నిర్మాతలు చాలా రకాలుగా నష్టపోయారు. కలెక్షన్లు అసలు బ్రేక్ ఈవెన్ కు దరిదాపుల్లో కూడా లేవు. అంతేకాకుండా ఒప్పందానికి విరుద్ధంగా ముందుగానే ఓటీటీలోకి తీసుకువస్తున్నందుకు నార్త్ డిస్ట్రిబ్యూటర్లకు రూ.25 లక్షల నష్ట పరిహారం చెల్లించాల్సి వచ్చింది.
ఇవన్నీ కాకుండా నెట్ఫ్లిక్స్ మేకర్స్ తో అంతకుముందు కుదుర్చుకున్న డీల్ ను భారీగా తగ్గించేసింది. మూవీ రిలీజ్ కు ముందు ఏకంగా రూ.135 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. కానీ సినిమాకు నెగటివ్ రివ్యూలు రావడం, బాక్సాఫీస్ ఫెయిల్యూర్ తో దానిని రూ.110 కోట్లకు తగ్గించేసింది.
నిజానికి రూ.90 కోట్లే చెల్లిస్తామని నెట్ఫ్లిక్స్ స్పష్టం చేసినా.. మేకర్స్ దానిని రూ.110 కోట్లకు పెంచగలిగారు. థియేటర్లలో డిజాస్టర్ అయిన థగ్ లైఫ్ సినిమాకు నెట్ఫ్లిక్స్ లో ఎంతమేర రెస్పాన్స్ వస్తుందన్నది ఆసక్తికంగా మారింది. ఓటీటీలోనూ నెగటివ్ రివ్యూలే వస్తాయా లేక కొంతయినా ఆదరణ లభిస్తుందా అన్నది చూడాలి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper













