టాలీవుడ్ లో మరో విషాదం.. సీనియర్ ప్రొడ్యూసర్ మృతి.. శ్రీహరిని హీరోగా.. కాజల్ హీరోయిన్ గా పరిచయం చేసింది ఆయనే

టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. స్టార్ డైరెక్టర్ రవి కుమార్ చౌదరి మరణించిన ఒక్క రోజు వ్యవధిలోనే సీనియర్ ప్రొడ్యూసర్ మహేంద్ర కన్నుమూశారు. శ్రీహరిని హీరోగా, కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా పరిచయం చేసింది ఆయనే. 

Published on: Jun 12, 2025, 11:58:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ లో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. మంగళవారం (జూన్10) రాత్రి స్టార్ డైరెక్టర్ రవి కుమార్ చౌదరీ మరణించగా.. బుధవారం (జూన్ 11) రాత్రి సీనియర్ ప్రొడ్యూసర్ కావూరి మహేంద్ర కన్నుమూశారు. మంచి సినిమాలు ప్రొడ్యూస్ మంచి నిర్మాతగా పేరు తెచ్చుకున్న కావూరి మహేంద్ర తుదిశ్వాస విడిచారు. ఏఏ ఆర్ట్స్ అధినేత మహేంద్ర (79) నిన్న రాత్రి చనిపోయారు.

మరణించిన ప్రొడ్యూసర్ మహేంద్ర (x/Gopichandh Malineni)
మరణించిన ప్రొడ్యూసర్ మహేంద్ర (x/Gopichandh Malineni)

అనారోగ్యంతో

సీనియర్ ప్రొడ్యూసర్ కావూరి మహేంద్ర గత కొంతకాలంగా గుండె సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నారు. గుంటూరులోని రమేష్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ వచ్చారు. ఆయన భార్య, కుమార్తె ఉన్నారు. కొన్నేళ్ల క్రితం కుమారుడు జీతు మరణంతో మహేంద్ర కుంగిపోయారు. మహేంద్రకు ప్రముఖ నిర్మాత, నటుడు మాదాల రవి అల్లుడు.

మంచి నిర్మాతగా

1946 ఫిబ్రవరి 4న గుడివాడ తాలూకు దోసపాడులో జన్మించిన కె.మహేంద్ర ముందుగా దర్శకత్వ శాఖలో శిక్షణ పొందారు. ఆ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా పని చేశాక నిర్మాతగా మారారు. 1977లో ‘ప్రేమించి పెళ్లి చేసుకో’ సినిమా ఆయనకు ప్రొడ్యూసర్ గా ఫస్ట్ ఫిల్మ్. ఏఏ ఆర్ట్స్ బ్యానర్ ను స్థాపించారు మహేంద్ర. ఏఏ ఆర్ట్స్ తో పాటు గీతా ఆర్ట్పిక్చర్స్ పతాకాలపై 36 చిత్రాలు నిర్మించారు.

‘ఏది పుణ్యం? ఏది పాపం?', 'ఆరని మంటలు', 'తోడు దొంగలు', 'బందిపోటు రుద్రమ్మ', 'ఎదురలేని మొనగాడు', 'ఢాకూరాణి', ప్రచండ భైరవి', 'కనకదుర్గ వ్రత మహాత్మ్యం', ‘దేవా’, ‘కూలీ’, ‘ఒక్కడే’, ’అమ్మ లేని పుట్టిల్లు’ తదితర సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.

శ్రీహరిని హీరోగా

దివంగత నటుడు, రియల్ స్టార్ శ్రీహరిని హీరోగా పరియం చేస్తూ తీసిన ‘పోలీస్’ సినిమాకు మహేంద్రనే ప్రొడ్యూసర్. అలాగే ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా చేసింది కూడా ఆయనే. ఆయన ప్రొడ్యూస్ చేసిన ‘లక్మీ కల్యాణం’ సినిమాతోనే కాజల్ తెరంగేట్రం చేసింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కెరీర్ కు మహేంద్రనే మార్గనిర్దేశనం చేశారు.

డైరెక్టర్ షాక్

తన గురువు కె.మహేంద్ర మరణ వార్త వినగానే డైరెక్టర్ గోపీచంద్ మలినేని షాక్ అయ్యారు. ‘‘అంకితభావం ఉన్న ప్రొడ్యూసర్ మహేంద్ర మరణ వార్త వినగానే తీవ్రమైన బాధ కలిగింది. సినిమా పట్ల ఆయన తపన ఎప్పటికీ గుర్తుండిపోతోంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’’ అని గోపీచంద్ మలినేని ఎక్స్ లో పోస్టు పెట్టారు.

రిలీజ్ కాకపోవడంతో

కన్మణి దర్శకత్వంలో రాజశేఖర్ నటించిన "అర్జున" సినిమా ప్రొడ్యూసర్ గా మహేంద్రకు చివరి చిత్రం. వివిధ కారణాల వల్ల ఈ మూవీ రిలీజ్ కాలేదు. దీంతో ఆయన ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా మరింత కుంగిపోయారు. విలువలతో కూడిన సీనియర్ నిర్మాతల్లో ఒకరైన మహేంద్ర మరణం పట్ల పలువురు చిత్ర ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. మహేంద్ర స్వస్థలం గుంటూరు. వారి అంత్యక్రియలు అక్కడే ఈరోజు (జూన్ 12)న జరగనున్నాయి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More