Vidya Balan:ఫుటేజీ మిస్సింగ్-25 ఏళ్ల త‌ర్వాత యూట్యూబ్‌లో మూవీ రిలీజ్-ఇర్ఫాన్ ఖాన్‌తో న‌టించ‌డంపై విద్యా బాల‌న్ పోస్ట్

Vidya Balan: షూటింగ్ కంప్లీట్ అయిన 25 ఏళ్ల తర్వాత రిలీజైన మూవీ కథ ఇది. ఇర్ఫాన్ ఖాన్, విద్యా బాలన్ కలిసి నటించిన ‘ది లాస్ట్ టెనెంట్’ మూవీ డైరెక్ట్ గా యూట్యూబ్ లో విడుదలైంది. ఆ మూవీ షూటింగ్ జ్ఞాపకాలను, దివంగత ఇర్ఫాన్‌తో తన అనుబంధాన్ని వివరిస్తూ విద్యా బాలన్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Published on: May 8, 2026, 08:33:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vidya Balan: ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఆరో వర్ధంతి సందర్భంగా ఒక అద్భుతం జరిగింది. జీవించి ఉన్నప్పుడు ఆయన నటించిన ‘ది లాస్ట్ టెనెంట్’ సినిమా 25 ఏళ్ల తర్వాత నేరుగా యూట్యూబ్‌లో విడుదలైంది. ఈ చిత్రంలో ఇర్ఫాన్‌తో కలిసి నటించిన బాలీవుడ్ నటి విద్యాబాలన్.. తాజాగా ఈ మూవీని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ పంచుకుంది.

విద్యా బాలన్ (PTI)
విద్యా బాలన్ (PTI)

అది చీకటి కాలం

"ది లాస్ట్ టెనెంట్ షూటింగ్ ముగిసిన 25 ఏళ్ల తర్వాత నిన్న రాత్రి మొదటిసారి ఆ సినిమా చూశా. షూటింగ్ పూర్తయ్యాక ఏదో కారణం వల్ల ఆ సినిమా విడుదల కాలేదు. అది నా జీవితంలో ఒక చీకటి కాలం.

నేను ఏ పని మొదలుపెట్టినా అప్పుడు ఆగిపోయేది. నా మొదటి మలయాళ చిత్రం 'చక్రం' అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఆ తర్వాత దాదాపు మూడేళ్ల కాలంలో సుమారు డజను సినిమాల నుంచి నన్ను తప్పించారు" అని విద్యా బాలన్ ఆనాటి రోజులను గుర్తు చేసుకుంది.

దర్శకుడి మెసేజ్ తో

తన కష్టకాలంలో వచ్చిన సినిమా కావడంతో 'ది లాస్ట్ టెనెంట్' గురించి కూడా విద్యా బాలన్ పూర్తిగా మర్చిపోవాలని నిర్ణయించుకున్నారట. అయితే దర్శకుడు సార్థక్ దాస్‌గుప్తా గత వారం మెసేజ్ చేసే వరకు ఈ చిత్రం విడుదలవుతుందన్న విషయం తనకు తెలియదని ఆమె చెప్పింది.

ఇర్ఫాన్‌తో షూటింగ్

"ఆ రోజుల్లో షూటింగ్ సెట్ నుంచి నా సోదరి ప్రియకు ఫోన్ చేసి, ఇర్ఫాన్ ఖాన్‌తో కలిసి నటిస్తున్నానని ఎంతో ఉత్సాహంగా చెప్పాను. అప్పుడే ఆయన నటన ఎంతో సహజంగా ఉండేది. నిన్న సినిమా చూస్తున్నప్పుడు కూడా నాకే అదే అనిపించింది. ఆయన నటనలో ఎక్కడా ఆర్టిఫిషియల్ ఫీల్ ఉండదు.

మేము కలిసి నటించాల్సిన కొన్ని సినిమాలు ఆగిపోయాయని ఇర్ఫాన్ మరణం తర్వాత చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు మా ఇద్దరి కలయికలో 'ది లాస్ట్ టెనెంట్' రూపంలో కనీసం ఒక్క సినిమా అయినా ఉందన్న సంతృప్తి మిగిలింది" అని ఇర్ఫాన్ నటనకు విద్యా జోహార్లు అర్పించింది.

ఎందుకు ఆగిపోయింది?

దర్శక నిర్మాత సార్థక్ దాస్‌గుప్తా ఈ సినిమాను పూర్తి చేయడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. సినిమాకు సంబంధించిన ఒరిజినల్ ఫుటేజ్ పోవడంతో ప్రాజెక్ట్ మధ్యలోనే నిలిచిపోయింది. ఇక ఈ సినిమా రాదని ఆశలు వదులుకున్న తరుణంలో, అనుకోకుండా ఒక పాత వీహెచ్‌ఎస్ (VHS) కాపీ లభ్యమైంది. దాన్ని డిజిటలైజ్ చేసి, రిస్టోరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

కథా నేపథ్యం

ది లాస్ట్ టెనెంట్ చిత్రం ఒక విభిన్నమైన కథాంశంతో సాగుతుంది. జీవితంలో విసిగిపోయిన ఒక సంగీత విద్వాంసుడు.. దేశం విడిచి వెళ్ళే ముందు ఒక పాడుబడ్డ ఇంట్లో తలదాచుకుంటాడు. అక్కడ గడిపిన సమయంలో పాత జ్ఞాపకాలు, సంగీతం, ఒంటరితనం అతడిని ఎలా ప్రభావితం చేశాయన్నదే ఈ సినిమా. ఇందులో అన్ను ఖండేల్వాల్, సౌరభ్ అగర్వాల్, సబ్య సాచి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇర్ఫాన్ ఖాన్ నటించిన ఈ అరుదైన చిత్రాన్ని ఇప్పుడు ఆయన అభిమానులు యూట్యూబ్‌లో వీక్షించవచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: 'ది లాస్ట్ టెనెంట్' సినిమా ఎక్కడ అందుబాటులో ఉంది?

జవాబు: ఈ సినిమా ప్రస్తుతం యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో ఉచితంగా వీక్షించడానికి అందుబాటులో ఉంది.

ప్రశ్న: ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు జరిగింది?

జవాబు: ఈ చిత్రం షూటింగ్ 25 ఏళ్ల క్రితమే జరిగింది.

ప్రశ్న: సినిమా ఇన్నేళ్లు ఎందుకు విడుదల కాలేదు?

జవాబు: చిత్రానికి సంబంధించిన ఒరిజినల్ ఫుటేజ్ పోవడంతో ఇది నిలిచిపోయింది. ఇటీవల వీహెచ్‌ఎస్ కాపీ దొరకడంతో దర్శకుడు దీన్ని విడుదల చేశారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More