జీ తెలుగులో ఈ రోజు నుంచే సరికొత్త సీరియల్.. ఆ రెండు సీరియల్స్ టైమింగ్స్ మారిపోయాయ్
జీ తెలుగులో ఈరోజు నుంచి అంటే సోమవారం (జులై 14) నుంచి సరికొత్త సీరియల్ ప్రారంభం కాబోతోంది. దీంతో ఇప్పటికే ప్రసారమవుతున్న రెండు సీరియల్స్ టైమింగ్స్ కూడా మారిపోయాయి. మరి ఆ సీరియల్ ఏంటి? ఏ సమయానికి వస్తుందో చూడండి.
ప్రముఖ తెలుగు ఛానెల్స్ లో ఒకటైన జీ తెలుగులోకి సోమవారం (జులై 14) నుంచి ఓ కొత్త సీరియల్ వస్తోంది. ఈ సీరియల్ పేరు జయం. గత వారమే గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా చేశారు. ఇప్పుడు తొలి ఎపిసోడ్ కు సిద్ధమైంది. ప్రేమ, పట్టుదల, బాధ్యతల మధ్య సాగే ప్రేమకథ అంటూ ఈ సీరియల్ ను ఆ ఛానెల్ ప్రమోట్ చేస్తోంది.

జయం సీరియల్ టైమ్ ఇదే
జీ తెలుగులోకి వస్తున్న సీరియల్ పేరు జయం. ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. ఈరోజు (జులై 14) నుంచే ప్రారంభం కాబోతోంది. ఈ సీరియల్ ను జీ తెలుగు ఛానెల్ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తోంది. శ్రీరామ్ వెంకట్, వర్షిణిలాంటి వాళ్లు నటించిన ఈ సీరియల్ పై భారీ ఆశలే పెట్టుకుంది. ఓ స్ఫూర్తివంతమైన కథతో రాబోతున్న సీరియల్ ఇది.
జయం సీరియల్ స్టోరీ ఇదే..
జయం సీరియల్ కథ మాజీ బాక్సర్ రుద్రప్రతాప్ (శ్రీరామ్ వెంకట్), పేదింటి అమ్మాయి గంగావతి(వర్షిణి) జీవితాల చుట్టూ తిరుగుతుంది. రుద్ర తన సోదరుడి మరణం, చెరగని గాయాలతో కూడిన గతంతో సతమతమవుతుండగా.. పేదరికం, తల్లి అనారోగ్యం, తండ్రి బాధ్యతారాహిత్యంతో గంగ జీవితం దినదిన గండంగా సాగుతుంది. వీరిద్దరూ ఎలా కలుస్తారు? వారి మధ్య ప్రేమ చిగురిస్తుందా? గతాన్ని అధిగమించి ముందుకు వెళ్లగలరా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ జయం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే.
ఆ రెండు సీరియల్స్ టైమ్ మార్పు
జీ తెలుగులోకి కొత్త సీరియల్ వస్తుండటంతో ఇప్పటికే ప్రసారమవుతున్న రెండు సీరియల్స్ టైమింగ్ మారిపోయింది. సోమవారం (జులై 14) నుంచి చామంతి, జగద్ధాత్రి సీరియల్స్ టైమింగ్ మారిపోనుంది. ఇక నుంచి సోమవారం నుంచి శనివారం వరకు చామంతి సీరియల్ ప్రతి రోజు రాత్రి 8.30 గంటలకు ప్రసారం అవుతుంది. గతంలో ఇది 8 గంటలకు వచ్చేది. ఇక జగద్ధాత్రి సీరియల్ సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఇప్పటి వరకూ ఈ సీరియల్ 8.45కు ప్రారంభమయ్యేది.
టీఆర్పీ రేటింగ్స్ విషయంలో స్టార్ మా ఛానెల్ తో పోలిస్తే జీ తెలుగు సీరియల్స్ వెనుబడి ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఛానెల్ సరికొత్త సీరియల్స్ తోపాటు ప్రస్తుతం ఉన్న సీరియల్స్ టైమింగ్స్ ను కూడా మారుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



