...
...
Next Story

Heat Stroke Alert : ఎండలు మండుతున్నాయి.. జాగ్రత్త! వడదెబ్బ నుంచి కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మండుతున్న ఎండలు, వేడి గాలుల కారణంగా వడదెబ్బ ముప్పు పెరుగుతోంది. వడదెబ్బ లక్షణాలు ఏంటి…? ప్రాథమిక చికిత్స ఎలా చేయాలి…? ఎండ నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో ఇక్కడ తెలుసుకోండి….

Published on: Apr 20, 2026, 12:23:04 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేసవి సెగలు అప్పుడే మొదలయ్యాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో వేడి గాలుల (Heatwaves) తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలో 'వడదెబ్బ' (Heatstroke) అనేది ఒక సాధారణ సమస్యగా అనిపించినప్పటికీ, ఇది ప్రాణాంతకమైన స్థితికి దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

PREMIUMవడదెబ్బ జాగ్రత్తలు
వడదెబ్బ జాగ్రత్తలు

శరీర ఉష్ణోగ్రత క్రమంగా పెరిగి, దానిని నియంత్రించే శక్తిని మన శరీరం కోల్పోయినప్పుడు వడదెబ్బ తగులుతుంది. దీనిని సకాలంలో గుర్తించి జాగ్రత్తలు తీసుకోకపోతే జ్వరం, మైకము, మూర్ఛ లేదా అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

వడదెబ్బ లక్షణాలను గుర్తించడం ఎలా?

  • చాలా మంది వడదెబ్బను సాధారణ జ్వరంగా లేదా నీరసంగా భావించి పొరపడుతుంటారు. వేసవిలో ఇలాంటి నిర్లక్ష్యం ప్రమాదకరం. ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేసవి సెగలు అప్పుడే మొదలయ్యాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో వేడి గాలుల (Heatwaves) తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలో 'వడదెబ్బ' (Heatstroke) అనేది ఒక సాధారణ సమస్యగా అనిపించినప్పటికీ, ఇది ప్రాణాంతకమైన స్థితికి దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

PREMIUMవడదెబ్బ జాగ్రత్తలు
వడదెబ్బ జాగ్రత్తలు

శరీర ఉష్ణోగ్రత క్రమంగా పెరిగి, దానిని నియంత్రించే శక్తిని మన శరీరం కోల్పోయినప్పుడు వడదెబ్బ తగులుతుంది. దీనిని సకాలంలో గుర్తించి జాగ్రత్తలు తీసుకోకపోతే జ్వరం, మైకము, మూర్ఛ లేదా అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

వడదెబ్బ లక్షణాలను గుర్తించడం ఎలా?

  • చాలా మంది వడదెబ్బను సాధారణ జ్వరంగా లేదా నీరసంగా భావించి పొరపడుతుంటారు. వేసవిలో ఇలాంటి నిర్లక్ష్యం ప్రమాదకరం. ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి:
  • తీవ్రమైన తలనొప్పి మరియు విపరీతమైన జ్వరం.
  • కళ్లు తిరగడం, కళ్ళు బైర్లు కమ్మడం లేదా విపరీతమైన బలహీనత.
  • వాంతులు లేదా వికారం కలిగించే భావన.
  • గొంతు ఆరిపోవడం మరియు చర్మం పొడిబారి ఎర్రగా మారడం.
  • చెమట పట్టడం ఆగిపోయి శరీరం విపరీతంగా వేడెక్కడం.

"తీవ్రమైన అవసరం ఉంటే తప్ప మధ్యాహ్నం పూట ఎండలోకి వెళ్లడం మానుకోవాలి. బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వడదెబ్బ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు," అని వైద్యులు సూచిస్తున్నారు.

మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో అవుట్‌డోర్ పనులను వాయిదా వేసుకోవడం ఉత్తమం. దాహం వేయకపోయినా ప్రతి అరగంటకు ఒకసారి నీరు తాగుతూ ఉండాలి. దీనివల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. నీటితో పాటు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, చెరకు రసం లేదా పండ్ల రసాలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లు అందుతాయి.

బయటకు వెళ్లేటప్పుడు శరీరమంతా కప్పేలా తేలికపాటి రంగుల్లో ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. తలకు టోపీ లేదా కండువా కట్టుకోవడం, గొడుగు వాడటం తప్పనిసరి.ఖాళీ కడుపుతో ఎండలోకి వెళ్లకూడదు. టీ, కాఫీలు శరీరంలోని నీటిని త్వరగా తగ్గిస్తాయి కాబట్టి, వాటిని తాగిన వెంటనే ఎండలోకి వెళ్లకపోవడం మంచిది. పుచ్చకాయ, దోసకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.

వడదెబ్బ తగిలితే ఏం చేయాలి..?

ఒకవేళ ఎవరైనా వడదెబ్బకు గురైతే, వెంటనే వారిని నీడ ఉన్న చల్లని ప్రదేశానికి చేర్చాలి. "బాధితుడి శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం ఇక్కడ అత్యంత ముఖ్యం. నుదురు, మెడ మరియు చంకల భాగంలో చల్లటి నీటితో తడిపిన గుడ్డను ఉంచాలి లేదా శరీరాన్ని తడిగుడ్డతో తుడవాలి, అని నిపుణులు వివరిస్తున్నారు.

బాధితుడు స్పృహలో ఉంటే ఓఆర్ఎస్ (ORS), గ్లూకోజ్ లేదా ఉప్పు-చక్కెర ద్రావణాన్ని నెమ్మదిగా తాగించాలి. పరిస్థితి మెరుగుపడకపోతే లేదా స్పృహ తప్పిపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమీపంలోని ఆసుపత్రికి తరలించాలి. వడదెబ్బ విషయంలో ప్రతి నిమిషం విలువైనదని గుర్తుంచుకోవాలి.

All Access.
One Subscription.

Get 360° coverage—from daily headlines
to 100 year archives.

E-Paper
Full
Archives
Full Access to
HT App & Website
Games
 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON