కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా అందరి కళ్లు ఆమె పట్టుకున్న డిజిటల్ ‘బహీ-ఖాతా’పైనే కాకుండా, ఆమె కట్టుకున్న చీరపై కూడా పడ్డాయి. వరుసగా తొమ్మిది బడ్జెట్లను ప్రవేశపెట్టిన తొలి భారతీయ ఆర్థిక మంత్రిగా చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్న నిర్మలమ్మ.. తన ‘చీర దౌత్యాన్ని’ (Saree Diplomacy) ఈసారి కూడా కొనసాగించారు.
మెరూన్ రంగు చేనేత చీరలో ‘రిఫార్మ్ ఎక్స్ప్రెస్’
భారతీయ వారసత్వాన్ని, ఆర్థిక దార్శనికతను మేళవిస్తూ నిర్మలా సీతారామన్ ఈ కీలక రోజు కోసం ‘మెరూన్’ రంగు చేనేత పట్టుచీరను ఎంచుకున్నారు. ఆవ రంగు (Mustard Yellow) చెక్స్తో కూడిన ఈ చీరకి ముదురు గోధుమ రంగు బోర్డర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి కాంట్రాస్ట్గా పసుపు రంగు బ్లౌజ్ను ధరించిన ఆమె, తన వస్త్రధారణలో హుందాతనాన్ని, నిరాడంబరతను చాటారు.
సిగ్నేచర్ రెడ్ సిల్క్ కవర్లో ఉన్న డిజిటల్ టాబ్లెట్ను పట్టుకుని ఆమె పార్లమెంటులోకి ప్రవేశిస్తున్న దృశ్యం, దేశ ఆర్థిక ప్రయాణానికి ఒక శక్తివంతమైన సంకేతంగా నిలిచింది.
చేనేత కళాకారులకు గౌరవం
2019లో తన మొదటి బడ్జెట్ నుంచి నిర్మలా సీతారామన్ భారతీయ వస్త్ర ప్రపంచంలోని భిన్నత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఆమె ఎంపిక కేవలం ఫ్యాషన్ కోసం మాత్రమే కాదు; అది ఆయా ప్రాంతీయ కళలకు ఇచ్చే గౌరవం. దేశీయ నేత కార్మికులకు జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు తీసుకురావడమే ఆమె ప్రధాన ఉద్దేశం.
గత బడ్జెట్లలో నిర్మలమ్మ వస్త్రధారణ: నిర్మలా సీతారామన్ గతంలోనూ వివిధ రాష్ట్రాల ప్రత్యేక చేనేత చీరలను ధరించి వార్తల్లో నిలిచారు.
తెలంగాణ: ఎరుపు, ఆఫ్-వైట్ కలర్ ‘పోచంపల్లి’ చీర.
{{/usCountry}}తెలంగాణ: ఎరుపు, ఆఫ్-వైట్ కలర్ ‘పోచంపల్లి’ చీర.
{{/usCountry}}బీహార్: మిథిల కళకు ప్రతిరూపమైన క్రీమ్ కలర్ ‘మధుబని’ సిల్క్ చీర.
ఒడిశా: 2024లో నీలిరంగు ‘టస్సర్ సిల్క్’ కంతా వర్క్ చీర.
కర్ణాటక: 2023లో ధరించిన రెడ్ టెంపుల్ బోర్డర్ చీర.