ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్ - ఫైనల్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
ఏపీ కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు https://slprb.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. మొత్తం 33,921 మంది అర్హత సాధించారు.
ఏపీ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. తుది రాత పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 37,600 మంది హాజరుకాగా….. 33,921 మంది అర్హత సాధించారు. ఈ ఫలితాలను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
- కానిస్టేబుల్ నియామక పరీక్షలు రాసిన అభ్యర్థులు https://slprb.ap.gov.in/UI/index వెబ్ సైట్ లోకి వెళ్లండి
- హోం పేజీలోని రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- ఇక్కడ అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
- సబ్మిట్ చేస్తే రిజల్ట్ డిస్ ప్లే అవుతుంది.
మరోవైపు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను కూడా అందుబాటులో ఉంచారు. వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే జూలై 11 నుంచి 17 వరకు తెలపవచ్చని అధికారులు ప్రకటించారు.
ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ ప్రాసెస్ ఇలా…
- అభ్యర్థులు https://slprb.ap.gov.in/UI/index వెబ్ సైట్ లోకి వెళ్లండి
- హోం పేజీలోని ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- ఇక్కడ అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
- సబ్మిట్ చేస్తే రిజల్ట్ డిస్ ప్లే అవుతుంది.
ఏపీలో కానిస్టేబుళ్ల నియామకాల కోసం 2023 ఏడాదిలో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. ఇందుకు 4,59,182 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 95,208 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. వీరికి 2024 డిసెంబరులో దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేశారు. ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల్లో 38,910 మంది అర్హత సాధించారు.
ఏపీలో కానిస్టేబుల్రిక్రూట్ మెంట్ ప్రక్రియ మొదలై రెండేళ్లు కావొస్తోంది. పలు కారణాల రీత్యా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీస్ శాఖలో దిగువ స్థాయి సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. పోలీస్ రిక్రూట్మెంట్పై దృష్టి సారించిన కూటమి సర్కార్… నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే జూన్ 1వ తేదీన పరీక్షలను నిర్వహించారు. వీటికి సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేశారు. ఎంపికైన వారికి శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత నియామక పత్రాలను అందజేస్తారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper


