...
...
Next Story

ఏపీ డీఎస్సీ పరీక్షల అప్డేట్స్ - ఇవాళ్టి నుంచి ప్రాథమిక 'కీ'లు విడుదల, లింక్ ఇదే

ఏపీ డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే కొన్ని పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీలపై విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. నేటి నుంచి ( జూన్ 17) స్కూల్ అసిస్టెంట్ కన్నడ, ఒడియా, తమిళం ఉర్దూ పరీక్షల ప్రాథమిక కీలు అందుబాటులోకి వస్తాయి.

Published on: Jun 17, 2025, 06:00:07 IST
By , , Andhrapradesh
Prefer HTon Google
Advertisement

ఏపీ డీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు పరీక్షలు ముగిశాయి. జూన్ 30వ తేదీ నాటికి అన్ని పరీక్షలు పూర్తి కానున్నాయి. అయితే కొన్ని పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలను ఇవాళ విద్యాశాఖ విడుదల చేయనుంది. వీటిపై అభ్యంతరాలను కూడా స్వీకరించనుంది.

ఇవాళ ప్రాథమిక కీ లు విడుదల

ఏపీ డీఎస్సీ పరీక్షల అప్డేట్స్
ఏపీ డీఎస్సీ పరీక్షల అప్డేట్స్

నేటి నుంచి (జూన్ 17) స్కూల్ అసిస్టెంట్ కన్నడ, ఒడియా, తమిళం ఉర్దూ పరీక్షల ప్రాథమిక కీ విడుదల కానుంది. వీటికపై జూన్ 23వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఈ ప్రాథమిక కీలను https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లో పొందవచ్చు. అభ్యంతరాలను కూడా ఇదే వెబ్ సైట్ నుంచి పంపవచ్చు. త్వరలోనే మిగతా పేపర్ల ప్రాథమిక కీ లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

మెగా డీఎస్సీ నిర్వహణలో భాగంగా సోమవారం జరిగిన స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజ్) సోషల్ స్టడీస్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 38,243 అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోగా 36,372 (95.11%) మంది హాజరయ్యారు. ఈ మేరకు డీఎస్సీ–2025 కన్వీనర్ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 227 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు ఉదయం అనంతపురం జిల్లాలో (97.84%) మంది, మధ్యాహ్నం చిత్తూరు జిల్లాలో (97.98%)అత్యధికంగా అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు.

స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్) మైనర్ మీడియా కన్నడ, ఒడియా, తమిళం, ఉర్దూ విభాగాలకు చెందిన ప్రాథమిక కీ నేటి (జూన్ 17) నుంచి అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. https://apdsc.apcfss.in వెబ్ సైటులో రెస్పాన్స్ షీట్ అభ్యర్థుల లాగిన్ లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అభ్యర్థులు ప్రాథమిక కీ పై తమ అభ్యంతరాలను తగిన ఆధారాలతో ఈ నెల 23లోపు వెబ్ సైట్ ద్వారా మాత్రమే తెలియజేయాలని స్పష్టం చేశారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe