...
...
Next Story

ఏపీ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయ్… మీ ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

ఏపీ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులు.. cets.apsche.ap.gov.in/EAPCET వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనమిత్ర వాట్సాప్ (9552300009) ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వివరాలను మంత్రి లోకేశ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Updated on: Jun 08, 2025 05:43 PM IST
By , , Andhrapradesh
Prefer HTon Google
Advertisement

ఏపీ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వివరాలను వెల్లడించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ ఈఏపీసెట్ - 2025 పరీక్షలను నిర్వహించారు. పరీక్ష రాసిన విద్యార్థులు ఏపీఈఏపీసెట్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఉత్తీర్ణత శాతం వివరాలు ఇవే…

ఏపీ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు
ఏపీ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు

ఈసారి అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ కు 81,837 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా… 75460 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 67,761 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 89.8 శాతం క్వాలిఫై అయ్యారు.

ఇక ఇంజినీరింగ్ స్టీమ్ లో చూస్తే… 2,80,611 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,64,840 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,89,748 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తంగా 71.65 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇంజినీరింగ్‌ స్ట్రీమ్ లో మొదటి ర్యాంకర్ గా అనిరుధ్‌ రెడ్డి నిలిచారు. రెండో ర్యాంకర్ గా భాను రెడ్డి, మూడో ర్యాంకర్ గా యస్వంత్‌ సాధ్విక్‌ ఉన్నారు.

మే నెలలో పరీక్షలు…

ఏపీ ఈఏపీసెట్పరీక్షలు మే 19 నుంచి మే 27వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగాయి. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను నిర్వహించారు. మే21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జరిగాయి. మే 27న అగ్రికల్చర్‌, ఫార్మసి ప్రాథమిక కీని విడుదల చేశారు. మే 28వ తేదీన ఇంజినీరింగ్ ప్రిలిమినరీ కీని విడుదల చేశారు. మే 30వ తేదీతో అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. దీంతో ఫలితాలను ఇవాళ విడుదల చేశారు.

ఏపీ ఈఏపీసెట్ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి..

  • పరీక్షలు రాసిన విద్యార్థులు https://cets.apsche.ap.gov.in/EAPCET/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే ఏపీ ఈఏపీసెట్ - 2025 ఫలితాల లింక్ పై క్లిక్ చేయాలి.
  • రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ తో పాటు పలు వివరాలను నమోదు చేయాలి.
  • సబ్మిట్ చేస్తే మార్కులతో పాటు ర్యాంక్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

మనమిత్రలో ఇలా…

Step 1 : ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు 'Hi' అని మెసేజ్ చేయాలి.

Step 2 : ఆ తర్వాత 'సెలెక్ట్ సర్వీస్' లో 'విద్యా సేవలు' ఎంచుకోవాలి.

Step 3 : ' ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు- 2025' ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 4 : 'హాల్ టికెట్' నెంబర్‌ తో పాటు రిజిస్ట్రేషన్ నెంబర్ ను నమోదు చేయాలి.

Step 5 : PDF రూపంలో ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.

ఏపీ ఈఏపీసెట్- 2025 ఫలితాల్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. రిజర్వేషన్లను కూడా ప్రమాణికంగా తీసుకుంటారు. ఫలితాల వెల్లడించిన నేపథ్యంలో… త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తారు. విడతల వారీగా సీట్లను కేటాయిస్తారు. సీట్లు ఖాళీగా ఉంటే స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ కు అవకాశం ఇస్తారు. దీనిపై ఏపీ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంటుంది.

ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ ఈఏపీసెట్ - 2025 ర్యాంక్ కార్డును నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe