ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ 2025 : వెబ్ ఆప్షన్లు ప్రారంభం - ఈ నెల 25న ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు
ఏపీ ఐసెట్ - 2025 కౌన్సెలింగ్ కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 13 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ… వాయిదా పడింది. దీంతో నేటి నుంచి 21వ తేదీ వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
ఏపీ ఐసెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. జూలై 10వ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా… జూలై 14తో గడువు ముగిసింది. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… జూలై 13 నుంచే వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి రావాల్సి ఉండేది. కానీ పలు కాలేజీలకు ప్రభుత్వ అనుమతులు రావడంలో జాప్యం జరగడంతో తేదీలను మార్చినట్లు అధికారులు ప్రకటించారు.

నేటి నుంచి వెబ్ ఆప్షన్లు…
వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడగా నేటి (జూలై 16) నుంచి ఆ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు జూలై 21వ తేదీ వరకు కాలేజీల ఎంపిక కోసం వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. జూలై 22వ తేదీన వెబ్ ఆప్షన్ల ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది.
జూలై 25న సీట్ల కేటాయింపు…
జూలై 25వ తేదీన ఐసెట్- 2025 సీట్లను కేటాయించనున్నారు. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ లో భాగంగా సీట్లు పొందిన అభ్యర్థులు జూలై 26 నుంచి ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు జూలై 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందే విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. లేకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఏపీలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్-2025 నిర్వహించారు. మే 20 వ తేదీన ఫలితాలను విడుదల చేశారు. ఈసారి ఐసెట్ ప్రవేశ పరీక్ష బాధ్యతలను ఆంధ్ర యూనివర్సిటీ చేపట్టింది.
మే 7న రాష్ట్రంలోని 94 పరీక్ష కేంద్రాల్లో ఐసెట్ నిర్వహించారు. ఐసెట్ ఫలితాలను https://cets.apsche.ap.gov.in/ICET/ ఈ లింక్ లో తెలుసుకోవచ్చు. మొత్తం 34,131 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా…. 32,719 మంది(95.86%) విద్యార్థులు ఐసెట్ పరీక్షలో అర్హత సాధించిన సంగతి తెలిసిందే.
ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ ఐసెట్ - 2025 వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper


