...
...
Next Story

ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - రేపు సప్లిమెంటరీ ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండి

ఏపీ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాల విడుదలకు ముహుర్తం ఫిక్స్ అయింది. జూన్ 7వ తేదీన ఉదయం 11 గంటలకు ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.

Published on: Jun 06, 2025 12:30 PM IST
By , , Andhrapradesh
Prefer HTon Google
Advertisement

ఇంటర్ విద్యార్థులకు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల తేదీని ప్రకటించింది. రేపు(జూన్ 07) ఉదయం 11 గంటలకు ఫలితాలు అందుబాటులోకి వస్తాయని విద్యాశాఖ తెలిపింది. ఈ ఫలితాలను https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్ లో లేదా మనమిత్ర 9552300009 వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025

ఏపీ ఇంటర్ పరీక్షలు మే 12 నుంచి 20వ తేదీ వరకు రెండు సెషన్లలో జరిగాయి. ఉదయం సెషన్‌లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం సెషన్‌లో రెండో సంవత్సరం విద్యార్థులకు నిర్వహించారు.

వాట్సాప్ లో ఇలా చెక్ చేసుకోండి:

ఏపీ ఇంటర్మీడియట్ఫలితాలను ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మనమిత్రవాట్సాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…

Step 1 : ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు 'Hi' అని మెసేజ్ చేయాలి.

Step 2 : ఆ తర్వాత 'సెలెక్ట్ సర్వీస్' లో 'విద్యా సేవలు' ఎంచుకోవాలి.

Step 3 : 'డౌన్‌లోడ్ ఏపీ ఇంటర్ ఫలితాలు- 2025' ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 4 : మార్కుల మెమో పొందడానికి మీ 'హాల్ టికెట్' నెంబర్‌ను నమోదు చేయాలి.

Step 5 : PDF రూపంలో ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.

ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో ఇలా….

ఏపీ ఇంటర్ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…

  • Step 1: విద్యార్థులు ఏపీ ఇంటర్ విద్యా మండలి అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in/ పై క్లిక్ చేయాలి.
  • Step 2: వెబ్‌సైట్ హోమ్‌పేజీ 'AP IPE ఫలితాలు 2025' అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • Step 3: తర్వాత ఇంటర్ 1వ సంవత్సరం లేదా 2వ సంవత్సరం ఫలితాలపై క్లిక్ చేయండి. లాగిన్ విండో ఓపెన్ అవుతుంది.
  • Step 4: లాగిన్ విండోలో విద్యార్థి హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయండి.
  • Step 5 : స్క్రీన్ పై ఇంటర్ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. భవిష్యత్ అవసరాల కోసం ఇంటర్ మార్క్ షీట్ డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe