ఏపీ విద్యార్థులకు అలర్ట్ - ఇంటర్మీడియట్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, చివరి తేదీ ఎప్పుడంటే..?

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలపై ఏపీ ఇంటర్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రవేశాల గడువును జూలై 31వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రకటన విడుదలైంది. అర్హులైన విద్యార్థులు ఈ తేదీలోపు అడ్మిషన్లు తీసుకోవచ్చు. 

Published on: Jul 3, 2025, 10:06:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు కొనసాగుతున్నాయి.ఈ గడువును జూలై 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ విద్యా శాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా జా ఓ ప్రకటన ద్వారా ప్రకటించారు. అర్హులైన విద్యార్థులు… వెంటనే అడ్మిషన్లు తీసుకోవాలని సూచించారు.

ఏపీ ఇంటర్ బోర్డు ప్రవేశాలు
ఏపీ ఇంటర్ బోర్డు ప్రవేశాలు

తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… జూన్ 30వ తేదీతోనే ప్రవేశాల గడువు ముగిసింది. అయితే విద్యార్థులతో పాటు పలువురి నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో… ఈ గడువును పొడిగించారు. దీంతో టెన్త్పాస్ అయిన విద్యార్థులు… జూలై 30వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకోవచ్చు.

అకడమిక్ క్యాలెండర్ ఇలా…

ఇక 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్బోర్డు ఇప్పటికే అకడమిక్ క్యాలెండర్ ను కూాడా విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ జూనియర్ కాలేజీలు మొత్తం 314 పని దినాలు పని చేస్తాయి. మొత్తం 79 రోజులు సెలవులు ఉండనున్నాయి.

అకడమిక్ షెడ్యూల్ ప్రకారం… ఏపీలో జూన్ 2 కాలేజీలు పునఃప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇంటర్ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు జరుగుతున్నాయి. సెకండ్ ఇయర్ విద్యార్థులకు తరగతులు కొనసాగుతున్నాయి.సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 దసరా సెలవులు ఉంటాయి. ఇక జనవరి 10 – జనవరి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. ఫిబ్రవరి 2026లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తాయి. మార్చి 2026లో ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More