ఏపీ మెగా డీఎస్సీ హాల్ టికెట్ల విడుదలపై అప్డేట్ - జూన్ 6 నుంచి పరీక్షలు

ఏపీ మెగా డీఎస్సీ హాల్ టికెట్లు రేపు(శుక్రవారం) విడుదల కానున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు apdsc.apcfss.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పరీక్షలు జూన్‌ 6 నుంచి ప్రారంభం కానున్నాయి.

Published on: May 29, 2025 2:04 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ మెగా డీఎస్సీకి సంబంధించి మరో అప్డేట్. రేపట్నుంచి(మే 30) హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపీ మెగా డీఎస్సీ హాల్ టికెట్లు
ఏపీ మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఈసారి ఈ మెగా డీఎస్సీకి3,35,401 మంది అభ్యర్థులు అప్లయ్ చేసుకోగా… అన్ని పోస్టులకు కలిపి 5,77,417 అప్లికేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు వారి అర్హతలకు అనుగుణంగా… ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.

ఒక్కో పోస్టుకు 35 మంది పోటీ…!

ఒక్కో పోస్టుకు సరాసరి 35 మంది పోటీ పడుతున్నారు. ఈసారి మహిళలు ఎక్కువగా పోటీ పడుతున్నారు. దాదాపు 2,03,647 మంది మహిళా అభ్యర్థులు, 1,31,754 మంది పురుషుల నుంచి దరఖాస్తులు అందాయి. డీఎస్సీపోస్టులు అధికంగా ఉన్న కర్నూలు జిల్లాలకు సంబంధించి అభ్యర్థుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 2678 పోస్టులు ఉండగా.. 39,997 మంది అభ్యర్థుల నుంచి మొత్తం 73,605 అప్లికేషన్లు వచ్చాయి. ఇతర రాష్ట్రాల నుంచి 7,159 మంది అభ్యర్థుల నుంచి 10,143 అప్లికేషన్లు వచ్చాయి.

హాల్ టికెట్ డౌన్లోడ్ ఇలా….

ఏపీ మెగా డీఎస్సీలో భాగాగం…. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం….మే 30వ తేదీ నుంచి నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి వస్తాయి. https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు వారి లాగిన్ వివరాలతో సులభంగా వీటిని పొందే అవకాశం ఉంటుంది.

జూన్ 6 నుంచి పరీక్షలు….

ఏపీ డీఎస్సీపరీక్షలు జూన్‌ 6 నుంచి ప్రారంభమై…. జులై 6వ తేదీ వరకు జరుగుతాయి. సీబీటీ విధానంలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలను పరీక్షలు పూర్తయిన రెండు రోజుల్లో విడుదల చేస్తారు. ప్రాథమిక కీల విడుదల తర్వాత 7 రోజులపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత ఫైనల్ కీని ప్రకటిస్తారు. తుది కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత మెరిట్ జాబితా విడుదలవుతాయి.

పరీక్షల సమయం దగ్గరపడిన నేపథ్యంలో…. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రోజుకి సరాసరి 40 నుంచి 50 వేల మందికి ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ మేరకు కేంద్రాలను ఎంపిక చేస్తున్నారు. ఇందుకు సంబంధించి రేపోమాపో వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.