...
...
Next Story

ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల - మీ స్కోర్ ఇలా చెక్ చేసుకోండి

ఏపీ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలు రాసిన విద్యార్థులు www.bse.ap.gov.in/ లింక్ తో చెక్ చేసుకోవచ్చు. మనమిత్ర వాట్సాప్ లోనూ మార్కుల వివరాలను తెలుసుకోవచ్చు.

Published on: Jun 12, 2025 04:56 PM IST
By , , Andhrapradesh
Prefer HTon Google
Advertisement

ఏపీ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ - 2025 ఫలితాలు వచ్చేశాయి. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు పదో తరగతి అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా సులభంగా తెలుసుకోవచ్చు.

ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు
ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు 1,23,477 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 76.14 శాతం మంది ఉత్తీర్ణులైయ్యారు. బాలుర ఉత్తీర్ణత శాతం 73.55గా నమోదు కాగా.. బాలికలది 80.10 శాతం ఉత్తీర్ణత ఉంది. 98.24 శాతం ఉత్తీర్ణతతో ప్రకాశం జిల్లా టాప్ ప్లేస్ లో ఉండగా…. పశ్చిమ గోదావరి జిల్లా 50.24 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది.

ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండి

  1. ముందుగా https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు - 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ విద్యార్థి రూల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
  4. సబ్మిట్ చేస్తే మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

మనమిత్ర వాట్సాప్ లో ఇలా…

టెన్త్ విద్యార్థులు మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. ప్రాసెస్ వివరాలు కింది విధంగా ఉంటాయి….

Step 1 : ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు 'Hi' అని మెసేజ్ చేయాలి.

Step 2 : ఆ తర్వాత 'సెలెక్ట్ సర్వీస్' లో 'విద్యా సేవలు' ఎంచుకోవాలి.

Step 4 : మార్కుల మెమో పొందడానికి మీ 'హాల్ టికెట్' నెంబర్‌ను నమోదు చేయాలి.

Step 5 : పీడీఎఫ్ రూపంలో ఫలితాలు కనిపిస్తాయి.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe