బ్రిక్స్ దేశాలపై సుంకాలను పెంచుతామని డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్.. రిప్లై ఇచ్చిన చైనా!

బ్రిక్స్ 2025 శిఖరాగ్ర సమావేశం బ్రెజిల్‌లోని రియో​​డిజనీరోలో జరిగింది. ఇందులో భారతదేశంతో సహా సభ్య దేశాలు పాల్గొన్నాయి. అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతు ఇచ్చే ఏ దేశానికైనా 10 శాతం సుంకం విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ బెదిరించారు. దీనిపై చైనా స్పందించింది.

Published on: Jul 07, 2025 6:24 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

్రెజిల్‌లోని రియో​​డిజనీరోలో బ్రిక్స్ సదస్సు జరిగింది. భారత ప్రధాని మోదీ సహా సభ్య దేశాల నాయకులు, ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంతో డోనాల్డ్ ట్రంప్ బెదిరింపులు చేశారు. బ్రిక్స్ దేశాల విధానాలకు మద్దతు ఇచ్చే దేశాలపై అదనపు సుంకాలు విధిస్తామని డోనాల్డ్ ట్రంప్ చెప్పారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (REUTERS)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (REUTERS)

అమెరికన్ వ్యతిరేక విధానాలకు మద్దతు ఇచ్చే దేశాలపై అదనంగా 10 శాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. బ్రెజిల్‌లోని రియో​​డిజనీరోలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో డోనాల్డ్ ట్రంప్ పేరు చెప్పకుండా సుంకాల పెంపును విషయాన్ని బ్రిక్స్ గ్రూప్ ఖండించింది. దీనికి ప్రతిస్పందనగా ఆయన ఈ బెదిరింపు చేశారు. బ్రిక్స్‌లో అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతు ఇచ్చే ఏ దైశానికైనా 10 శాతం టారిఫ్‌లు విధిస్తామని చెప్పారు. ఇప్పుడు దీనిపై చైనా స్పందించింది.

చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. 'బ్రిక్స్ అంతర్జాతీయ సమాజంలో సానుకూల శక్తి అని మేం విశ్వసిస్తున్నాము. దాని సహకారం బహిరంగంగా, అందరినీ కలుపుకొని ఉంటుంది. ఏ ఒక్క దేశాన్ని లక్ష్యంగా చేసుకోలేదు. సుంకాల విషయానికొస్తే ఎల్లప్పుడూ సుంకాల యుద్ధాలు, వాణిజ్య యుద్ధాలను వ్యతిరేకిస్తాం. బలవంతం, ఒత్తిడితో సుంకాలను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తాం. సుంకాలను ఏకపక్షంగా విధించడం సరికాదు.' అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారానికి బ్రిక్స్ గ్రూప్ ఒక ముఖ్యమైన వేదిక అని చైనా తెలిపింది. ఇది ఏ దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి ఘర్షణలో పాల్గొనదు లేదా ఏ దేశాన్ని లక్ష్యంగా చేసుకోదని స్పష్టం చేసింది.

బ్రెజిల్‌లో జరిగిన బ్రిక్స్ 2025 శిఖరాగ్ర సమావేశానికి బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా సభ్య దేశాలు హాజరయ్యాయి. ఇరాన్ అణు, సైనిక సౌకర్యాలపై అమెరికా-ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ ప్రకటన కూడా వెలువడింది.