విదేశీ విద్య మీ కలనా? 12వ తరగతి తర్వాత అడ్మిషన్ కోసం రాయాల్సిన ముఖ్యమైన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవే!

విదేశాల్లో చదువుకోవాలనుకునే 12వ తరగతి విద్యార్థులకు కేవలం బోర్డు పరీక్షల మార్కులు మాత్రమే సరిపోవు. ఐఈఎల్​టీఎస్, టోఫెల్ వంటి భాషా నైపుణ్య పరీక్షలతో పాటు ఎస్​ఏటీ, ఏసీటీ వంటి ప్రవేశ పరీక్షలు కూడా ఎంతో కీలకం. ఆ వివరాలు మీకోసం..

Published on: Apr 4, 2026, 05:24:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇంటర్మీడియట్ లేదా సీబీఎస్ఈ 12వ తరగతి పూర్తికాగానే ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని చాలామంది విద్యార్థులు కలలు కంటారు. అయితే, ఇతర దేశాల్లోని యూనివర్సిటీల్లో సీటు సాధించాలంటే కేవలం మీ బోర్డు పరీక్షల ఫలితాలు మాత్రమే ఉంటే సరిపోదు. అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా మెజారిటీ విశ్వవిద్యాలయాలు కొన్ని ప్రత్యేక ప్రవేశ పరీక్షలు, భాషా నైపుణ్య పరీక్షల స్కోర్లను తప్పనిసరిగా అడుగుతాయి.

విదేశీ విద్య మీ కలనా?
విదేశీ విద్య మీ కలనా?

ముందుగా ఇంగ్లీష్‌పై పట్టు నిరూపించుకోవాలి..

విదేశీ విద్యకు సంబంధించి అత్యంత సాధారణ అవసరాలలో ఒకటి 'ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీ'. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో చదువుకోవాలంటే ఐఈఎల్​టీఎస్, టోఫెల్ వంటి పరీక్షల్లో మంచి స్కోరు సాధించాలి. ఈ పరీక్షలు మీ రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్ నైపుణ్యాలను అంచనా వేస్తాయి.

అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం..

ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో డిగ్రీ అడ్మిషన్ల కోసం ఎస్​ఏటీ లేదా ఏసీటీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇవి విద్యార్థుల్లోని గణితం, సైన్స్, ఆంగ్ల భాషా సామర్థ్యాలను పరీక్షిస్తాయి. ఒకవేళ మీరు బిజినెస్ సంబంధిత కోర్సులను ఎంచుకోవాలనుకుంటే, ప్రోగ్రామ్ స్థాయిని బట్టి జీమ్యాట్ స్కోరు అవసరం కావచ్చు.

అడ్మిషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది?

క్లాస్​ 12 తర్వాత చేరేందుకు.. ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో రకమైన నిబంధనలు ఉన్నప్పటికీ, సాధారణంగా అడ్మిషన్ ప్రక్రియ మూడు ప్రధానాంశాల చుట్టూ తిరుగుతుంది:

అకాడమిక్ పర్ఫార్మెన్స్: మీ గత విద్యా రికార్డులు.

టెస్ట్ స్కోర్లు: ప్రవేశ పరీక్షల్లో వచ్చిన మార్కులు.

ప్రొఫైల్ అసెస్‌మెంట్: మీ వ్యక్తిత్వం, ప్రతిభను వివరించే ప్రొఫైల్.

ఈ పరీక్షలు ప్రధానంగా విద్యార్థిలోని క్వాంటిటేటివ్ ఎబిలిటీ, వెర్బల్ రీజనింగ్, అనలిటికల్ థింకింగ్‌ను పరీక్షిస్తాయి. వీటితో పాటు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, లెటర్ ఆఫ్ రికమెండేషన్, కొన్ని సందర్భాల్లో పర్సనల్ ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి.

ప్రొఫెషనల్, రీసెర్చ్ కోర్సుల కోసం..

ఒకవేళ మీరు లా లేదా మెడికల్ వంటి వృత్తి విద్యా కోర్సులు చేయాలనుకుంటే, ఆయా దేశాల నిబంధనల ప్రకారం అదనంగా సబ్జెక్ట్-స్పెసిఫిక్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇక పీజీ లేదా పీహెచ్‌డీ వంటి రీసెర్చ్ ప్రోగ్రామ్స్ విషయానికి వస్తే.. జీఆర్ఈ స్కోరుతో పాటు మీ పరిశోధనా అనుభవం, పబ్లికేషన్స్, ఫండింగ్ వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి.

సరైన ప్రణాళిక, పక్కా ప్రిపరేషన్ ఉంటే.. మీ 12వ తరగతి మార్కులతో పాటు ఈ ప్రవేశ పరీక్షల స్కోర్ల సాయంతో ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో అడుగుపెట్టడం అసాధ్యమేమీ కాదు.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. విదేశాల్లో చదువుకోవడానికి ఇంగ్లీష్ భాషా పరీక్షలు ఎందుకు తప్పనిసరి?

అంతర్జాతీయ విద్యార్థులు తరగతుల్లో బోధించే పాఠాలను సులభంగా అర్థం చేసుకునే సామర్థ్యం కలిగి ఉన్నారని నిర్ధారించుకోవడానికి ఈ పరీక్షలు అవసరం.

2. 12వ తరగతి తర్వాత విదేశీ అడ్మిషన్ కోసం కేవలం మార్కులు ఉంటే సరిపోతుందా?

లేదు, మార్కులతో పాటు భాషా నైపుణ్య పరీక్షలు (IELTS/TOEFL), కొన్ని దేశాల్లో ప్రవేశ పరీక్షల (SAT/ACT) స్కోర్లు కూడా తప్పనిసరి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More