చదువు ఫ్రీ- నెలకు రూ. 1లక్షకుపైగా స్టైఫండ్​.. ఈ స్కాలర్​షిప్​తో మీ ‘విదేశీ విద్య’ కలను నెరవేర్చుకోండి!

విదేశాల్లో చదువుకోవాలన్న కల మీ ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులతో ఆగిపోకూడదు! అందుకే మీరు ఈ ఎరాస్మస్​+ స్కాలర్​షిప్​ గురించి తెలుసుకోవాలి. దీని ద్వారా మీరు ఎలాంటి ట్యూషన్​ ఫీజు లేకుండా, స్టైఫండ్​తో చదువుకోవచ్చు. పూర్తి వివరాలు.. 

Published on: Jul 11, 2025 11:10 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అంతర్జాతీయ విద్యను అభ్యసించాలని కలలు కనే భారతీయ విద్యార్థులకు గుడ్​ న్యూస్​!. ఎలాంటి ఆర్థిక భారం లేకుండా యూరోపియన్ యూనియన్ ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఎరాస్మస్+ (Erasmus+) అనే స్కాలర్‌షిప్ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఇప్పుడు జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్ వంటి అగ్రశ్రేణి విద్యాసంస్థలున్న 19 యూరోపియన్ దేశాల్లో ట్యూషన్ ఫీజు లేకుండా చదువుకోవచ్చు! కొన్ని సందర్భాల్లో వీసా, ప్రయాణం, వసతి, బీమా వంటి అదనపు గ్రాంట్‌లతో పాటు నెలకు 1,400 యూరోలు (సుమారు ₹1.4 లక్షలు) వరకు స్టైపెండ్‌ను కూడా పొందే అవకాశం ఉంది.

ఈ స్కాలర్​షిప్​తో చదువు ఫ్రీ, స్టైఫండ్​ కూడా!
ఈ స్కాలర్​షిప్​తో చదువు ఫ్రీ, స్టైఫండ్​ కూడా!

ఎరాస్మస్+ అంటే ఏంటి?

ఈ ప్రోగ్రామ్​ యూరోపియన్ యూనియన్ ఫ్లాగ్​షిప్​ ఎడ్యుకేషనల్​ ఎక్స్​ఛేంజ్​ పథకంలో భాగం. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు అంతర్జాతీయ అనుభవాన్ని, అద్భుతమైన విద్యా అవకాశాలను, సాంస్కృతిక బదిలీని అందించడం దీని లక్ష్యం. భారతదేశం కూడా ఈ భాగస్వామ్య దేశాలలో ఒకటి కావడంతో.. భారతీయ విద్యార్థులు ఎరాస్మస్+ కింద అండర్ గ్రాడ్యుయేట్, పూర్తిస్థాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఈ ఎరాస్మస్+ కోసం ఇటీవలే ఎంపికైన వారిలో 101 మంది భారతీయ విద్యార్థులు రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు స్కాలర్‌షిప్‌లు అందుకున్నారు. వీరిలో 50 మంది మహిళలు ఉండటం, అంతర్జాతీయ విద్యలో లింగ సమతుల్యత మరియు సమ్మిళితత్వంపై బలమైన దృష్టిని సూచిస్తుంది.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

ఎరాస్మస్+ స్కాలర్‌షిప్‌కు అర్హత పొందడానికి:

  • దరఖాస్తుదారు భాగస్వామ్య దేశం (ఇందులో భారతదేశం ఒకటి) నుంచి అయి ఉండాలి.
  • అండర్ గ్రాడ్యుయేట్ దరఖాస్తుదారులు కనీసం 1-2 సంవత్సరాల కాలేజీ విద్య పూర్తి చేసి ఉండాలి.
  • పోస్ట్ గ్రాడ్యుయేట్దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.
  • ఇంగ్లీష్ ప్రావీణ్యం తప్పనిసరి. చాలా ప్రోగ్రామ్‌లకు IELTS (6.5-7.0 బ్యాండ్), TOEFL (90+ స్కోరు) లేదా ఇతర ఆమోదించిన భాషా పరీక్ష స్కోర్‌లు అవసరం.
  • మీ భారతీయ విశ్వవిద్యాలయం ఎరాస్మస్+ తో మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ (ఎంఓయూ) కలిగి ఉండాలి. నామినేషన్లు విశ్వవిద్యాలయం నియమించిన ఎరాస్మస్+ కోఆర్డినేటర్ ద్వారా జరగాలి.

ఎరాస్మస్​+ ప్రోగ్రామ్​.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఈ ప్రక్రియ మీ సొంత విశ్వవిద్యాలయంలోని ఎరాస్మస్+ కోఆర్డినేటర్‌ను సంప్రదించడంతో ప్రారంభమవుతుంది. దరఖాస్తులు సాధారణంగా ఆన్లైన్లో సమర్పించాలి. అకాడమిక్ మెరిట్, భాషా నైపుణ్యాలు, ఇంటర్వ్యూలలోని పనితీరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఎరాస్మస్+ ప్రోగ్రామ్​కి చెందిన దరఖాస్తులు ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ప్రారంభమవుతాయి. అయితే నిర్దిష్ట విశ్వవిద్యాలయం- కోర్సు ఆధారంగా గడువులు మారవచ్చు.