హెచ్1బీ వీసాకు తగ్గిన డిమాండ్.. గతంతో పోలిస్తే అప్లికేషన్లు చాలా తక్కువ

హెచ్1బీ వీసా రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే గణనీయమైన తగ్గుదలగా ఉంది. నిజానికి భారతీయ ఐటీ నిపుణులు హెచ్1బీని ఎక్కువగా ఉపయోగించుకుంటారు.

Published on: Jun 16, 2025, 14:40:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2026 సంవత్సరానికి హెచ్-1బీ వీసా క్యాప్ రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) తాజా డేటా ప్రకారం ఈసారి కేవలం 3.58 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇది గత సంవత్సరం 4.78 లక్షలతో పోలిస్తే 26.9 శాతం తగ్గుదల అన్నమాట. 2024తో పోలిస్తే ఈ సంఖ్య 54 శాతానికి పైగా తగ్గింది.

హెచ్1బీ వీసాకు తగ్గిన డిమాండ్
హెచ్1బీ వీసాకు తగ్గిన డిమాండ్

ఈ ఏడాది రిజిస్ట్రేషన్లు

ఈ ఏడాది మొత్తం రిజిస్ట్రేషన్లలో 1,20,141 రిజిస్ట్రేషన్లు జరిగాయి. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ భారతీయ ఐటీ ఉద్యోగులకు ముఖ్యమైనది, యూఎస్ టెక్ కంపెనీలు ప్రతిభావంతులను నియమించుకోవడానికి ఇది ప్రధాన మార్గంగా చూస్తాయి. ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్ 85,000 వీసాలను ఇస్తుంది. ఇందులో యూఎస్ మాస్టర్స్ డిగ్రీలు ఉన్నవారికి 20,000 సీట్లు ఉన్నాయి.

ఎందుకు తగ్గుదల?

కొత్త నిబంధనలు, అధిక హెచ్-1బీ ఖర్చులు, విదేశీ ఉద్యోగుల కెరీర్ ప్రణాళికలను మార్చడం వంటి అనేక కారణాలను ఈ భారీ పతనానికి కారణంగా ఉన్నాయి. డూప్లికేట్ ఎంట్రీలు, సిస్టమ్ దుర్వినియోగంపై యూఎస్సీఐఎస్ ఉక్కుపాదం మోపడం కూడా ఒక ప్రధాన కారణం. '2023 ఆర్థిక సంవత్సరం, 2024 ఆర్థిక సంవత్సరం హెచ్ -1బీ క్యాప్ సీజన్ల నుండి వచ్చిన సాక్ష్యాల ఆధారంగా మేం విస్తృతమైన దర్యాప్తులను చేపట్టాం. తదనుగుణంగా పిటిషన్లను తిరస్కరించాం, ఉపసంహరించుకున్నాం, క్రిమినల్ ప్రాసిక్యూషన్ కోసం చట్ట అమలు సూచనలను కొనసాగిస్తున్నాం.' అని యూఎస్సీఐఎస్ తన అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపింది.

పెరిగిన ఫీజు

పిటిషన్ తిరస్కరణలు, రద్దులు, క్రిమినల్ అభియోగాలతో సహా అవసరమైనప్పుడు కఠిన చర్యలు తీసుకుంటామని యూఎస్సీఐఎస్ వెల్లడించింది. విధానపరమైన మార్పులతో పాటు అప్లికేషన్ ఖర్చు కూడా దరఖాస్తుదారులు వెనుకంజ వేయడానికి పెద్ద కారణంగా మారింది. యుఎస్సీఐఎస్ ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ ఫీజును 10 డాలర్ల నుండి 250 డాలర్లకు పెంచింది. కెరీర్ ఇప్పుడే మెుదలుపెట్టినవారికి ఇది కాస్త పెద్ద విషయమే.

ఇతర దేశాల వైపు

అదే సమయంలో ఇప్పుడు ఎక్కువ మంది అమెరికా వైపు కాకుండా ఇతర దేశాల వైపు కూడా చూస్తున్నారు. చాలా మంది ఇప్పుడు ఆస్ట్రేలియా లేదా జర్మనీ వైపు ఆలోచిస్తున్నారని చికాగోలో నివసిస్తున్న హైదరాబాద్కు చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ అఫ్తాబ్ బి చెప్పారు.

గ్రీన్ కార్డుల కోసం సుదీర్ఘ నిరీక్షణ సమయం, హెచ్-1బీ డిపెండెన్సీ, ఉద్యోగ అస్థిరత వంటి అనిశ్చిత పరిస్థితులను అమెరికా ఎదుర్కొంటోంది. ఈ మార్పు భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లే విధానంపై పెద్ద ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాకు విద్యార్థులను పంపే దేశాల్లో భారత్ ఎప్పుడూ ముందుంటుంది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారుతుండటంతో చాలా మంది యూఎస్‌కు వెళ్లడానికి ఆలోచిస్తున్నారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More