...
...
Next Story

ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? ఎయిర్‌మెన్ గ్రూప్-వై రిక్రూట్‌మెంట్‌కు అప్లై చేయండి

ఐఏఎఫ్ ఎయిర్‌మెన్ గ్రూప్-వై నియామకానికి భారత వైమానిక దళం అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. మీరు కూడా ఈ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే airmenselection.cdac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

Published on: Jul 3, 2025, 15:05:57 IST
By ,
Prefer HTon Google
Advertisement

దేశానికి సేవ చేయాలని కలలు కంటున్న యువతకు ఒక సువర్ణావకాశం వచ్చింది. ఎయిర్‌మ్యాన్ గ్రూప్-వై పోస్టులకు నియామకం కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎయిర్ ఫోర్స్‌లో చేరడం ద్వారా దేశానికి సేవ చేయాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి ఛాన్స్. ఆన్‌లైన్ దరఖాస్తులు జూలై 11, 2025 నుండి ప్రారంభమవుతాయి. చివరి తేదీ జూలై 31, 2025గా నిర్ణయించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఆసక్తిగల అభ్యర్థులు ఎయిర్ ఫోర్స్ అధికారిక వెబ్‌సైట్ airmenselection.cdac.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మొత్తం పోస్టుల సంఖ్యను ప్రకటించలేదు. నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, మెరిట్ ఆధారంగా ఉంటుంది.

అర్హతలు

ఈ నియామకంలో దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థి భారత ప్రభుత్వం గుర్తించిన బోర్డు నుండి 12వ తరగతిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ సబ్జెక్టులతో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. దీనితో పాటు ఫార్మసీలో డిప్లొమా లేదా B.Sc చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతం

ఎంపికైన అభ్యర్థులకు మొదటి శిక్షణ సమయంలో నెలకు 14,600 స్టైఫండ్ లభిస్తుంది. శిక్షణ పూర్తయిన తర్వాత నెలకు దాదాపు 26,900 జీతం లభిస్తుంది. దీనితో పాటు ఇతర అలవెన్సులు, సౌకర్యాలను కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అందిస్తుంది.

ఫిట్‌నెస్

విద్య మాత్రమే కాదు, ఫిట్‌నెస్ కూడా అవసరం. అభ్యర్థి ఎత్తు, బరువు, ఛాతీ వెడల్పు, వినికిడి శక్తి వైమానిక దళం నిర్ణయించిన ప్రమాణాల ప్రకారం ఉండాలి. కనీస ఛాతీ చుట్టుకొలత 77 సెం.మీ ఉండాలి. వినికిడి శక్తి 6 మీటర్ల దూరం నుండి గుసగుస కూడా వినగలిగేలా ఉండాలి.

రాతపరీక్ష

భారత వైమానిక దళంలో ఎయిర్‌మెన్‌గా ఉద్యోగం పొందడానికి అభ్యర్థులను రాత పరీక్ష కూడా ఉంటుంది. రాత పరీక్షలో ఇంగ్లీష్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ నుండి ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్ష వ్యవధి 45 నిమిషాలుగా నిర్ణయించారు. పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు, ప్రతి తప్పు సమాధానానికి నాల్గవ వంతు మార్కు చొప్పున నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks