విరాట్ కోహ్లిని చూడగానే ఒంగి మరీ దండం పెట్టిన రోహిత్ శర్మ.. తన కెప్టెన్సీ తీసుకున్న గిల్తో రోహిత్ ఇలా..
ఆస్ట్రేలియా టూర్ కోసం బయలుదేరిన టీమిండియా ప్లేయర్స్ చాలా ఉత్సాహంగా కనిపించారు. ముఖ్యంగా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరో మాజీ విరాట్ కోహ్లిని చూడగానే ఒంగి మరీ దండం పెట్టడం విశేషం. అటు కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ ను హగ్ చేసుకున్నాడు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చాలా రోజుల తర్వాత మళ్లీ ఇండియన్ టీమ్ లోకి వచ్చారు. దీంతో మళ్లీ అందరి దృష్టి వాళ్లపైనే ఉంది. కానీ వాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పటికి, ఇప్పటికి టీమ్ ఇండియా వన్డే టీమ్ వాతావరణం కొంచెం మారింది. ఇప్పుడు టీమ్లో అంతా కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ హవా నడుస్తోంది. టెస్ట్ కెప్టెన్గా అతను అదరగొట్టే స్టార్ట్ ఇచ్చి మంచి జోష్లో ఉన్నాడు.
విరాట్ కోహ్లిని చూడగానే ఒంగి మరీ దండం పెట్టిన రోహిత్ శర్మ.. తన కెప్టెన్సీ తీసుకున్న గిల్తో రోహిత్ ఇలా..
కోహ్లిని చూడగానే రోహిత్ ఇలా..
2017లో ధోనీ కెప్టెన్సీ వదిలేశాక రోహిత్, కోహ్లీ వేరే వాళ్ల కెప్టెన్సీలో ఆడటం ఆస్ట్రేలియా టూర్లోనే మొదటిసారి. కొద్ది కాలం క్రితమే గిల్ న్యూజిలాండ్లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోనే డెబ్యూ చేశాడు. ఆ తర్వాత తన కెరీర్లో చాలా మటుకు రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే ఆడాడు. ఇప్పుడు ఆ ఇద్దరినీ తనే కెప్టెన్గా నడిపించబోతున్నాడు. ఇండియా కెప్టెన్గా ఆస్ట్రేలియాలో అతనికి ఇదే అతిపెద్ద టెస్ట్.
అయితే వీళ్ల కొత్త జర్నీ చాలా సరదాగా మొదలైంది. బుధవారం (అక్టోబర్ 15) బీసీసీఐ తన అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో.. రోహిత్ టీమ్ బస్ ఎక్కే ముందు ముందు వరుసలో కూర్చున్న కోహ్లీకి సరదాగా దండం పెడుతూ కనిపించాడు. దానికి కొన్ని నిమిషాల ముందు శుభ్మన్ గిల్ వెనక నుంచి సడెన్గా రావడంతో రోహిత్ కొంచెం సర్ప్రైజ్ అయ్యాడు. కెప్టెన్సీ మారిన తర్వాత వాళ్లిద్దరూ మొదటిసారి కలుసుకోవడంతో.. ఇండియా కొత్త వన్డే కెప్టెన్ గిల్, రోహిత్ భుజంపై చేయి వేసి పలకరించాడు. "హాయ్, గిల్! ఎలా ఉన్నావ్ భాయ్?" అని అడిగి ఇద్దరూ కౌగిలించుకున్నారు.
అందరి కళ్లూ రోహిత్, కోహ్లి పైనే..
ఆ తర్వాత వీడియో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మొదటిసారి కలుసుకున్న రోహిత్, కోహ్లీ వైపు తిరిగింది. చాలాకాలంగా టీమ్మేట్స్గా ఉన్న వాళ్లిద్దరూ ఒకరినొకరు చూసుకొని చాలా సంతోషపడ్డారు.
ఆ తర్వాత బస్ లోపల గిల్ తన మొదటి కెప్టెన్ (కోహ్లీ)ని కలిశాడు. ఇదంతా కోహ్లీ పక్క సీట్లో కూర్చుని శ్రేయస్ అయ్యర్ చూస్తున్నాడు. అయ్యర్కి కూడా ఇది చాలా పెద్ద సిరీస్. ఎందుకంటే వన్డే టీమ్కి వైస్ కెప్టెన్గా అతన్ని మొదటిసారి అఫీషియల్గా లీడర్షిప్ గ్రూప్లో చేర్చారు.
ఈ గ్రూప్లో మంచి ఫామ్లో ఉన్న ఓపెనర్ యశస్వి జైస్వాల్, ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్, పేసర్లు అర్ష్దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ ఉన్నారు. వీళ్లంతా ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కనిపించారు. ఇండియన్ స్టార్ క్రికెటర్లని ఒక్కసారైనా చూడాలని టెర్మినల్ బయట కొంతమంది ఫ్యాన్స్ గుమిగూడారు. కొంతమంది ఫ్యాన్స్ తాము తెచ్చుకున్న పోస్టర్లపై రోహిత్, కోహ్లీ ఆటోగ్రాఫ్లు తీసుకోగలిగారు.
ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, మిగతా కోచింగ్ స్టాఫ్ సాయంత్రం బయలుదేరే అవకాశం ఉంది. ఆదివారం పెర్త్లో ఈ వన్డే సిరీస్ మొదలవుతుంది. ఆ తర్వాత అడిలైడ్, సిడ్నీలో మ్యాచ్లు జరగనున్నాయి.
ఈ వన్డే సిరీస్ని అందరూ చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇది కేవలం గెలుపోటముల కోసమే కాదు, భవిష్యత్తులో కోహ్లీ, శర్మ రోల్స్ ఎలా ఉండబోతున్నాయో చెప్పడానికి కూడా ఇది ఒక సూచన కావచ్చు.
News/News/విరాట్ కోహ్లిని చూడగానే ఒంగి మరీ దండం పెట్టిన రోహిత్ శర్మ.. తన కెప్టెన్సీ తీసుకున్న గిల్తో రోహిత్ ఇలా..
News/News/విరాట్ కోహ్లిని చూడగానే ఒంగి మరీ దండం పెట్టిన రోహిత్ శర్మ.. తన కెప్టెన్సీ తీసుకున్న గిల్తో రోహిత్ ఇలా..