తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తుల గడువు ముగియగా.. అధికారులు మరోసారి పొడిగించారు. జూలై 31వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చని సూచించారు.

వివిధ కారణాల రీత్యా రెగ్యూలర్ విధానంలో టెన్స్, ఇంటర్ చదవలేనివారి కోసం టాస్ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరానికి గాను(2025-26) 10వ తరగతి, ఇంటర్లో ప్రవేశాలు పొందుతారు. పూర్తి వివరాలను https://www.telanganaopenschool.org/ వెబ్సైట్లో చూడొచ్చు.
ఫైన్ తో ఆగస్టు 28 వరకు గడువు…
ఆలస్య రుసుంతో ఆగస్టు 1 నుంచి 28 వరకు ప్రవేశాలు పొందవచ్చు. పదో తరగతిలో ప్రవేశం పొందేందుకు ఆగస్టు 31వ తేదీ నాటికి 14 ఏళ్లు నిండి ఉండాలి. ఇక ఇంటర్ లో ప్రవేశం పొందేందుకు ఆగస్టు 31 నాటికి 15 ఏళ్లు నిండి ఉండాలి.తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియం కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఆధార్ , మొబైల్ నెంబర్ కరెక్ట్ గా నమోదు చేసుకోవాలి. https://www.telanganaopenschool.org/ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. స్టడీ సెంటర్లను సరిగా చూసి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
అడ్మిషన్ కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నఅప్లికేషన్ ఫామ్ ను స్టడీ సెంటర్లలో సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అడ్మిషన్ ప్రక్రియ పూర్తవుతుంది.