తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ - 2025 : ఎట్టకేలకు ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు - అలాట్‌మెంట్‌ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఎట్టకేలకు ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించారు. https://tgpolycet.nic.in/ వెబ్ సైట్ నుంచి అలాట్ మెంట్ అర్డర్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

Published on: Jul 15, 2025 9:46 AM IST
By , , Telangana, Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ పాలిసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియపై కీలక ప్రకటన వచ్చేసింది. ఎట్టకేలకు ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించారు. ఈ మేరకు సీట్లు పొందిన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి అలాట్ మెంట్ అర్డర్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్
తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్

పాలిసెట్ ర్యాంక్ ఆధారంగా…. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సీట్లను కేటాయించారు. ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందిన విద్యార్థులు… ఇవాళ్టి నుంచే ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవచ్చు. ఇందుకు జూలై 18వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

అలాట్‌మెంట్‌ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

  1. అభ్యర్థులు https://tgpolycet.nic.in/Default.aspx వెబ్ సైట్లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే క్యాండెట్ లాగిన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  3. అభ్యర్థి లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
  4. సబ్మిట్ చేస్తే మీ అలాట్ మెంట్ కాపీ డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా కాపీని పొందవచ్చు.

జూలై 18వ తేదీ వరకు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసుకోవాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసుకోకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. https://tgpolycet.nic.in/cand_signin.aspx వెబ్ సైట్ లేదా సాంకేతిక విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలను తెలుసుకోవచ్చు.

జూలై 23 నుంచి రెండో విడత కౌన్సెలింగ్….

పాలిసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ జూలై 23 నుంచి ప్రారంభమవుతుంది. జూలై 24వ తేదీ నుంచి 25 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చు. జూలై 25వ తేదీలోపు అభ్యర్థులకు సీట్లు కేటాయింపు ఉంటుంది. జూలై 31వ తేదీ నుంచి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి.

ఈ ఏడాది జరిగిన పాలిసెట్పరీక్షకు మొత్తం 1,06,716 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మొత్తం 80,949 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కొత్తగా మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో 2 ప్రభుత్వ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలోని పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలల సంఖ్య 57 నుంచి 59కి పెరిగింది.ఈసారి మొత్తం 28,632 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ లింక్ పై క్లిక్ చేసి పాలిసెట్ అలాట్ మెంట్ కాపీని పొందవచ్చు