'దోస్త్' సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు - వెబ్ ఆప్షన్లకు మరికొన్ని గంటలే గడువు...!

డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే సెకండ్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్లకు గడువు దగ్గరపడింది. జూన్ 9వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఆప్షన్లను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.

Published on: Jun 08, 2025 7:38 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం దోస్త్ - 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి కాగా… ప్రస్తుతం సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి.

దోస్త్ ప్రవేశాలు 2025
దోస్త్ ప్రవేశాలు 2025

దోస్త్ సెకండ్ ఫేజ్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలి. ఈ గడువు రేపటితో (జూన్ 9) పూర్తి కానుంది. కాబట్టి అర్హులైన విద్యార్థులు వెంటనే వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. https://dost.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

ముఖ్య తేదీలు:

  • తెలంగాణ దోస్త్ సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు జూన్‌ 13వ తేదీన ఉంటుంది.
  • ఈ ఫేజ్ లో సీట్లు పొందే విద్యార్థులు.. జూన్ 13వ తేదీ నుంచి ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయవచ్చు.
  • ఈ గడువు జూన్ 18వ తేదీతో పూర్తవుతుంది. కాలేజీలో రిపోర్టింగ్ చేయకపోతే… సీటు రద్దవుతుంది.
  • తెలంగాణ దోస్త్ 3వ విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూన్‌ 13 నుంచి ఉంటుంది. ఇందుకు జూన్ 19వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
  • జూన్‌ 13 నుంచి 19 వరకు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
  • జూన్‌ 23న దోస్త్థర్డ్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది.
  • 3 విడతలు పూర్తి అయిన తర్వాత సీట్లు ఖాళీగా ఉంటే స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లను ప్రకటిస్తారు. దీనిపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
News/News/'దోస్త్' సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు - వెబ్ ఆప్షన్లకు మరికొన్ని గంటలే గడువు...!
News/News/'దోస్త్' సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు - వెబ్ ఆప్షన్లకు మరికొన్ని గంటలే గడువు...!