టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ - 2025 : ఇవాళ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు - మీ అలాట్మెంట్ ఇలా చెక్ చేసుకోవచ్చు
టీజీ ఈఏపీసెట్ - 2025 ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మాక్ సీట్ల కేటాయింపు జరగగా..పలువురు ఆప్షన్లు మార్చుకున్నారు. దీంతో ఇవాళ విద్యార్థులకు సీట్లను కేటాయించనున్నారు. tgeapcet.nic.in/default వెబ్ సైట్ ద్వారా అలాట్ మెంట్ చెక్ చేసుకోవచ్చు.
ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు టీజీ ఈఏపీసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు ప్రక్రియ పూర్తి కాగా… ఇవాళ ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించనున్నారు. ఇప్పటికే మాక్ కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా పలువురు అభ్యర్థులు ఆప్షన్లు కూడా మార్చుకున్నారు. దీంతో ఇవాళ(జూలై 18) ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనున్నారు.

టీజీ ఈఏపీసెట్(ఇంజినీరింగ్ స్ట్రీమ్) ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ కోసం 95,256 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరయ్యారు. వీరిలో 94,059 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. ఇప్పటికే వీరికి మాక్ సీట్ల కేటాయింపు జరగగా… తక్కువ ఆప్షన్లు ఇచ్చిన వారికి సీటు అలాట్ కాలేదు. దీంతో ఈ నెల 14,15 తేదీల్లో ఆప్షన్ల మార్పునకు కూడా అవకాశం ఇచ్చారు. అభ్యర్థులకు నచ్చిన కాలేజీలు, బ్రాంచ్లు అలాట్ కాకపోవడంతో విద్యార్థులు… మార్పులు చేర్పులు చేసుకున్నారు. ఈ ప్రక్రియ కూడా పూర్తి కావటంతో… ఇవాళ ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించనున్నారు.
ఇవాళ ఈఏపీసెట్ఫస్ట్ ఫేజ్ కు సంబంధించి సీట్లు పొందే విద్యార్థులు… జూలై 22వ తేదీలోపు వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు.
అలాట్ మెంట్ ఎలా చెక్ చేసుకోవాలంటే..?
- అభ్యర్థులు ముందుగా https://tgeapcet.nic.in/default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలోని సీటు అలాట్ మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- మీ లాగిన్ వివరాల ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా అలాట్ మెంట్ కాపీని పొందవచ్చు.
- ఈ విడతలో సీటు అలాట్ కాని వారు రెండో విడత కౌన్సెలింగ్ లో పాల్గొనాలి.
ఈ ఏడాది జరిగిన టీజీ ఈఏపీసెట్ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఫలితాలను చూస్తే... 2,20, 326 మంది దరఖాస్తు చేసుకోగా..2,07, 190 మంది హాజరయ్యారు. వీరిలో 1,51, 779 క్వాలిఫై కాగా... ఉత్తీర్ణత శాతం 73.26గా నమోదైంది. బాలికలు 65, 120 మంది ఉత్తీరులు కాగా... 86,659 మంది బాలురులు క్వాలిఫై అయ్యారు. బాలిక ఉత్తీర్ణత శాతం 73.88గా ఉండగా… బాలురది 72.79 శాతంగా నమోదైంది. వీరంతా కూడా ఇంజినీరింగ్ సీట్ల కోసం పోటీ పడుతున్నారు.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో… గతేడాది ఫీజులేఈసారి కూడా ఉండనున్నాయి. ఇదే విషయంపై ఫీజుల నియంత్రణ కమిటీ ప్రకటన విడుదల చేయనుంది. కోర్టు ఆదేశాలతో… ఫీజులను ఫిక్స్ చేస్తూ నిర్ణయం తీసుకోనుంది. ఫీజుల పెంపు లేకపోతే… విద్యార్థులకు బారం తప్పినట్లు అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

E-Paper












