...
...
Next Story

టీజీ ఎడ్‌సెట్‌ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ముఖ్య తేదీలివే

బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎడ్‌సెట్‌ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జూలై 21 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆగస్టు 4 నుంచి వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి.

Published on: Jul 12, 2025 11:02 AM IST
By , , Telangana, Hyderabad
Prefer HTon Google
Advertisement

రాష్ట్రంలో బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్‌సెట్‌ - 2025 కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. అడ్మిషన్ల ప్రక్రియ కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ వివరాల ప్రకారం… జూలై 14వ తేదీన కౌన్సెలింగ్ నోటిఫికేషన్ ను జారీ చేస్తారు. జూలై 21 నుంచి ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది.

టీజీ ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూల్ - ముఖ్య తేదీలు

  • టీజీ ఎడ్ సెట్ కౌన్సెలింగ్ (ఫస్ట్ ఫేజ్) నోటిఫికేషన్ - 14 జూలై 2025
  • రిజిస్ట్రేషన్లు ప్రారంభం - 21 జూలై 2025
  • రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ - 31 జూలై 2025
  • టీజీ ఎడ్‌సెట్‌ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ముఖ్య తేదీలివే
  • వెబ్ ఆప్షన్లు - 4 ఆగస్టు 2025 నుంచి5 ఆగస్టు 2025.
  • వెబ్ ఆప్షన్ల ఎడిట్ - 6 ఆగస్టు 2025.
  • ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు -9 ఆగస్టు 2025
  • కాలేజీల్లో రిపోర్టింగ్ - 11 ఆగస్టు 2025 - 14 ఆగస్టు 2025.
  • తరగతులు ప్రారంభం - 18 ఆగస్టు 2025.
  • అధికారిక వెబ్ సైట్- https://edcet.tgche.ac.in/

టీజీ ఎడ్ సెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ - 2025
టీజీ ఎడ్ సెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ - 2025

తెలంగాణ ఎడ్ సెట్ పరీక్షలు జూన్‌ 1వ తేదీన జరిగాయి. మొదటి షెషన్‌ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షను నిర్వహించారు.

ఈసారి జరిగిన ఎడ్సెట్కు 38,754 మంది దరఖాస్తు చేసుకోగా 32,106 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 30,944 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తం 96.38 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా…సీట్ల కేటాయింపు ఉంటుంది.

టీజీ ఎడ్ సెట్ ర్యాంకు కార్డు - డౌన్లోడ్ ప్రాసెస్

  1. అభ్యర్థులు ముందుగా టీజీ ఎడ్ సెట్ https://edcet.tgche.ac.in/ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోంపేజీలో డౌన్ లోడ్ ర్యాంక్ కార్డుపై క్లిక్ చేయండి
  3. అభ్యర్థి ఎడ్ సెట్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి.
  4. వ్యూ ర్యాంక్ కార్డుపై క్లిక్ చేయాలి.
  5. స్క్రీన్ పై విద్యార్థి ర్యాంకు కార్డు డిస్ ప్లే అవుతుంది.
  6. ర్యాంకు కార్డును డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.
  7. అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం. జాగ్రత్తగా ఉంచుకోవాలి.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe