తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. పరీక్షలు రాసిన విద్యార్థులు ఎస్ఎస్సీ బోర్డు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.
తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు - 2025
టెన్త్ సప్లిమెంటరీపరీక్షలు జూన్ 3 నుండి జూన్ 13వ తేదీ వరకు వరకు నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 42,832 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 38,741 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల్లో 24,415 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. అంటే 73.35 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి…
తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండి
పరీక్షలు రాసిన విద్యార్థులు https://bse.telangana.gov.in/ అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లాలి.
హోం పేజీలో కనిపించే "TG SSC ASE Result 2025" లింక్పై క్లిక్ చేయాలి.
మీ హాల్ టికెట్ నెంబర్ ను నమోదు చేయాలి.
సబ్మిట్ చేస్తే స్క్రీన్పై మీ రిజల్ట్ ప్రత్యక్షమవుతుంది.
రిజల్ట్స్ కాపీని ప్రింట్ లేద డౌన్లోడ్ ద్వారా పొందవచ్చు.
భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్అవుట్ తీసి ఉంచుకోండి.
తెలంగాణ పదో తరగతిరెగ్యూలర్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 30, 2025న ప్రకటించారు. ఈ సంవత్సరం రెగ్యులర్ అభ్యర్థులకు మొత్తం ఉత్తీర్ణత శాతం 92.78 శాతంగా నమోదైంది. అబ్బాయిల ఉత్తీర్ణత శాతం 91.32 శాతం కాగా, అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 94.26 శాతంగా ఉంది. మహబూబాబాద్ జిల్లా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోకెల్లా 99.29 శాతం ఉత్తీర్ణత రేటుతో ఈ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.
ఈ లింక్ పై క్లిక్ చేసి తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలను తెలుసుకోవచ్చు.