ఈ రెండు వాహనాలకు గ్రామాల్లో ఫుల్లు డిమాండ్.. వీటిని ఎందుకు ఎక్కువగా కొంటారు?
దేశంలో కొన్ని వాహనాలకు ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. గ్రామాల్లో ఎక్కువగా కొనే రెండు వాహనాలు ఉన్నాయి. అవి హీరో స్ప్లెండర్ ప్లస్, టీవీఎస్ ఎక్స్ఎల్.
తెలుగు రాష్ట్రలతో సహా దేశంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఇష్టమైన ద్విచక్ర వాహనాలు కొన్ని ఉంటాయి. హీరో స్ప్లెండర్ ప్లస్, టీవీఎస్ ఎక్స్ఎల్. ప్రతీ ఊరిలో వీటి సంఖ్య ఎక్కువగానే కనిపిస్తుంది. ఇప్పటికీ ఈ రెండు వాహనాల అమ్మకాలు జోరుగానే సాగుతూ ఉంటాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.

టీవీఎస్ ఎక్స్ఎల్
టీవీఎస్ ఎక్స్ఎల్ కూడా తక్కువ ధరకే లభిస్తుంది. ఈ మోపెడ్ ధర వేరియంట్ను బట్టి రూ.61,000 నుండి రూ.80,000 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. దీన్ని ఆన్-రోడ్లో రూ.1 లక్ష కంటే తక్కువ ధరకు పొందవచ్చు. టీవీఎస్ ఎక్స్ఎల్ 99సీసీ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ పొందుతుంది. 65 కేఎంపీఎల్ వరకు మైలేజీని అందిస్తుంది.
హీరో స్ప్లెండర్ ప్లస్
హీరో స్ప్లెండర్ ప్లస్ తక్కువ ధరకే దొరుకుతుంది. గ్రామీణ ప్రజలు సులభంగా కొనుగోలు చేస్తారు. ఈ బైక్ వివిధ రూపాల్లో లభిస్తుంది. ధర రూ.79,000 నుంచి రూ.85,000(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. దీని ఆన్ రోడ్ ధర రూ.1.5 లక్షల లోపల ఉంటుంది. హీరో స్ప్లెండర్ ప్లస్ మోటార్ సైకిల్ 97cc పెట్రోల్ ఇంజిన్తో శక్తిని కలిగి ఉంది. 70 కేఎంపీఎల్ వరకు మైలేజీని అందిస్తుంది.
ఎందుకు ఎక్కువ కొంటారు?
ఈ వాహనాలతో అడ్వాంటేజ్ ఏంటి అంటే.. ఏదైనా సమస్య ఉంటే స్థానిక గ్యారేజీలలోని మెకానిక్లు కూడా దానిని ఈజీగా రిపేర్ చేస్తారు. పట్టుకుని పట్టణాలకు పరుగులు తీయాల్సిన పని ఉండదు. సర్వీస్ సెంటర్లో రోజులు గడపాల్సిన అవసరం లేదు. ఈ ద్విచక్ర వాహనాల విడిభాగాలు కూడా సులభంగా దొరుకుతాయి.
గ్రామాల్లో ప్రజలు వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటారు. హీరో స్ప్లెండర్ ప్లస్, టీవీఎస్ ఎక్స్ఎల్ రోజువారీ పనిలో వివిధ మార్గాల్లో వారికి సహాయపడతాయి. పొలం నుండి ఇళ్లకు వీటిపై చాలా బరువును తీసుకురావొచ్చు. గ్రామాల్లో, సాధారణ రోడ్ల కంటే మట్టి రోడ్లు ఎక్కువగా ఉంటాయి. అక్కడ కూడా ఈ ద్విచక్ర వాహనాలపై ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయవచ్చు. ఇక మైలేజీ విషయంలోనూ ఇవి గ్రామీణ ప్రజలకు కలిసి వస్తాయి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper



