యూపీఎస్సీ అభ్యర్థులకు బిగ్​ అప్డేట్​! మెయిన్స్​ పరీక్షల షెడ్యూల్​పై క్లారిటీ, ఎప్పటి నుంచి అంటే..

యూపీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్​! యూపీఎస్సీ మెయిన్స్​ 2025 పరీక్షల షెడ్యూల్​ని తాజాగా విడుదల చేశారు. తేదీలు, టైమింగ్స్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jul 15, 2025 5:58 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్​ఈ) మెయిన్స్ 2025 పరీక్షల టైమ్‌టేబుల్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షలు 2025 ఆగస్టు 22, 23, 24, 30, 31 తేదీల్లో జరగనున్నాయి. పూర్తి వివరాలు..

యూపీఎస్సీ మెయిన్స్​ 2025 షెడ్యూల్​..
యూపీఎస్సీ మెయిన్స్​ 2025 షెడ్యూల్​..

యూపీఎస్సీ సీఎస్ఈ మెయిన్స్ 2025: టైమింగ్స్​..

యూపీఎస్సీ మెయిన్స్పరీక్ష 2025ని ప్రతి రోజు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం సెషన్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం సెషన్ 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతుంది.

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025: పరీక్షా విధానం..

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సీఎస్​ఈ పరీక్షా విధానం మూడు దశలుగా విభజించారు. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కొక్కటి 200 మార్కులకు, రెండూ ఆబ్జెక్టివ్-రకం ప్రశ్నలు ఉంటాయి. పేపర్ II (సీశాట్​) కేవలం అర్హత స్వభావం కలిగినది, అభ్యర్థులు కనీసం 33% మార్కులు సాధించాలి. రెండు పేపర్లు ఇంగ్లీష్, హిందీ భాషలలో నిర్వహిస్తారు.

మెయిన్స్ పరీక్షలో రెండు అర్హత పేపర్లు ఉంటాయి. పేపర్ ఏ (ఇండియన్ లాంగ్వేజ్), పేపర్ బీ (ఇంగ్లీష్), ఒక్కొక్కటి 300 మార్కులకు. మెరిట్ జాబితాకు పరిగణించే పేపర్లలో ఎస్సే), జనరల్ స్టడీస్ I నుంచి IV వరకు, ఒక ఆప్షనల్ సబ్జెక్టుకు సంబంధించిన రెండు పేపర్లు ఉంటాయి. వీటిలో ప్రతి ఒక్కటి 250 మార్కులకు ఉంటుంది.

  • యూజీసీ నెట్​ జూన్​ 2025 పరీక్షల ఫలితాాలు ఎప్పుడు? పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్​కు పిలుస్తారు. ఇది 275 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూలో కనీస మార్కులు అవసరం లేదు.

యూపీఎస్సీ సీఎస్​ఈ 2025: ఖాళీలు..

ఈ సంవత్సరం, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్​), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్​ఎస్​), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్​) వంటి ప్రతిష్టాత్మక సేవల్లో మొత్తం 979 ఖాళీలను భర్తీ చేయడానికి సివిల్ సర్వీసెస్ పరీక్ష జరుగుతోంది.

ఈ ఏడాది మే 25న యూపీఎస్సీ ప్రిలిమ్స్​ పరీక్షను నిర్వహించారు. ఆగస్ట్​లో మెయిన్స్​ పరీక్షను నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ రౌండ్​ ఉంటుంది.

యూపీఎస్సీ సీఎస్​ఈ మెయిన్స్​ 2025అడ్మిట్ కార్డులు, సూచనలకు సంబంధించిన తదుపరి అప్‌డేట్‌ల కోసం అభ్యర్థులు యూపీఎస్సీ వెబ్‌సైట్‌ను నిరంతరం తనిఖీ చేయాలని సూచించారు.

News/News/యూపీఎస్సీ అభ్యర్థులకు బిగ్​ అప్డేట్​! మెయిన్స్​ పరీక్షల షెడ్యూల్​పై క్లారిటీ, ఎప్పటి నుంచి అంటే..
News/News/యూపీఎస్సీ అభ్యర్థులకు బిగ్​ అప్డేట్​! మెయిన్స్​ పరీక్షల షెడ్యూల్​పై క్లారిటీ, ఎప్పటి నుంచి అంటే..