బైజూ రవీంద్రన్​కి భారీ షాక్​! ఆ 9000 కోట్లు కట్టాల్సిందే..

బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌కు భారీ షాక్! రూ. 9,000 కోట్లకు పైగా చెల్లించాల్సిందే అని అమెరికాలోని ఒక కోర్టు తేల్చి చెప్పింది.

Published on: Nov 22, 2025, 12:32:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బైజూస్ సంస్థకు చెందిన బైజూ ఆల్ఫా, అమెరికాకు చెందిన రుణదాత జీఎల్ఏఎస్ ట్రస్ట్ కంపెనీ ఎల్‌ఎల్‌సీ దాఖలు చేసిన పిటిషన్‌పై, ఒక యూఎస్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బైజూ రవీంద్రన్ ఒక బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ. 9,000 కోట్లకు పైగా) రుణాన్ని వ్యక్తిగతంగా తిరిగి చెల్లించాలని డిఫాల్ట్ తీర్పు ఇచ్చింది.

బైజూ రవీంద్రన్​ (MINT_PRINT)
బైజూ రవీంద్రన్​ (MINT_PRINT)

నవంబర్ 20న ఇచ్చిన ఈ తీర్పు ప్రకారం.. రవీంద్రన్ “డిస్కవరీ ఆర్డర్‌”కు కట్టుబడడంలో విఫలమయ్యారని, అనేక సందర్భాలలో తప్పించుకోవడానికి ప్రయత్నించారని డెలావేర్ బ్యాంక్రప్సీ కోర్ట్ గుర్తించినట్లు పీటీఐ నివేదించింది.

"కోర్టు ప్రతివాది రవీంద్రన్‌పై 533,000,000 డాలర్లకుపైగా మొత్తానికి, అలాగే కౌంట్స్ II, V, VI కింద 540,647,109.29 డాలర్ల మొత్తానికి డిఫాల్ట్ తీర్పును ప్రకటిస్తుంది" అని కోర్టు తీర్పును ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.

రుణం బదిలీ, ఉల్లంఘన ఆరోపణలు

రవీంద్రన్ ఎడ్‌టెక్ కంపెనీ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎల్​పీఎల్​ - ఇది బైజూస్ బ్రాండ్‌తో పనిచేస్తుంది)ను నిర్వహిస్తున్న సమయంలో బైజూస్ ఆల్ఫాను స్థాపించారు..

టీఎల్‌పీఎల్ అమెరికన్ రుణదాతల నుంచి 1 బిలియన్ డాలర్ల టర్మ్ లోన్ బి పొందింది.

ఆ తర్వాత, బైజూస్ ఆల్ఫా రుణ నిబంధనలను ఉల్లంఘించిందని, మొత్తం రుణంలో 533 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 4,400 కోట్లు) చట్టవిరుద్ధంగా అమెరికా నుంచి బదిలీ చేశారని రుణదాతలు ఆరోపించారు.

దీనితో, జీఎల్ఏఎస్ ట్రస్ట్ డెలావేర్ కోర్టును ఆశ్రయించి, బైజూస్ ఆల్ఫాపై నియంత్రణ సాధించడానికి అనుకూలమైన ఉత్తర్వులను పొందింది. ఈలోగా, బైజూస్ ఆల్ఫా, జీఎల్ఏఎస్ ట్రస్ట్ రెండూ 533 మిలియన్ డాలర్ల లావాదేవీల గురించి తెలుసుకోవడానికి డిస్కవరీ పిటిషన్‌లను డెలావేర్ బ్యాంక్రప్సీ కోర్టులో దాఖలు చేశాయి.

రవీంద్రన్ వైఖరిపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు

నవంబర్ 20 నాటి తీర్పు ప్రకారం.. బైజూ రవీంద్రన్‌కు డిస్కవరీ ఆర్డర్ గురించి తెలిసినప్పటికీ, ఆయన దానిని పాటించడానికి నిరాకరించారు.

"ఈ కేసులోని వాస్తవాలు, పరిస్థితులు చూస్తే, పెండింగ్‌లో ఉన్న డిస్కవరీ అభ్యర్థనలకు సరిగా స్పందించకపోవడం అనేది రవీంద్రన్ తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం," అని తీర్పు పేర్కొంది.

కోర్టు రవీంద్రన్ వాదనను తోసిపుచ్చింది. బైజూస్ ఆల్ఫా బుక్స్ ద్వారా జీఎల్ఏఎస్ ట్రస్ట్‌కు అవసరమైన డాక్యుమెంట్లు అందుబాటులో ఉన్నాయన్న వాదనకు రికార్డుల్లో ఎలాంటి మద్దతు లేదని పేర్కొంది.

"డిస్కవరీ ఆర్డర్‌కు కట్టుబడటంలో రవీంద్రన్ వైఖరి ఉద్దేశపూర్వక వైఫల్యం వ్యూహాత్మక విధానం అని కోర్టు గుర్తించింది" అని తీర్పు వెల్లడించింది.

డిఫాల్ట్ తీర్పు, రోజుకు జరిమానా

ఈ విషయంలో రవీంద్రన్ మునుపటి డిస్కవరీ ఆర్డర్‌లను ఉల్లంఘించినట్లు కోర్టు నిర్ధారించింది. కోర్టు ఉత్తర్వులను పాటించే వరకు రోజుకు 10,000 డాలర్ల జరిమానాను కూడా విధించింది.

"అయితే, ఈ ద్రవ్య జరిమానాలు చెల్లించిన, అవి నిరుపయోగంగా ఉన్నాయి. రవీంద్రన్ విదేశాల్లో నివసిస్తున్నారు. ఆయన తన ఆర్థిక జరిమానాలను చెల్లించడానికి లేదా డిస్కవరీ ఆర్డర్‌లను పాటించడానికి సిద్ధంగా లేనట్లు స్పష్టమవుతోంది. అందువల్ల, ద్రవ్య జరిమానాలు ప్రభావవంతమైన నివారణను అందించలేదు. అందుకే ఈ సందర్భంలో డిఫాల్ట్ తీర్పు వంటి కఠినమైన చర్య అవసరం," అని తీర్పులో పేర్కొన్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More