ముంబై: భారతదేశపు అతిపెద్ద డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థ జెరోధాలో సాంకేతిక సమస్య తలెత్తింది. సెప్టెంబర్ 3, బుధవారం ఉదయం ట్రేడింగ్ సెషన్ ప్రారంభమైన కొద్దిసేపటికే, ప్లాట్ఫామ్లో సాంకేతిక లోపం కారణంగా కొన్ని ట్రేడింగ్ యాప్స్లో ధరలు సరిగా అప్డేట్ కాలేదు. దీంతో మదుపరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
అసలేం జరిగింది?

బుధవారం ఉదయం, జెరోధా ట్రేడింగ్ ప్లాట్ఫామ్లోని 'కైట్' (Kite) యాప్లో ధరలు, ఇతర డేటా సరిగా కనిపించలేదు. ఈ సమస్య వల్ల మదుపరులు సరైన ధరల వద్ద కొనుగోలు, అమ్మకాలు జరపలేకపోయారు. దీనిపై పలువురు మదుపరులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) ద్వారా ఫిర్యాదులు చేశారు.
సమస్య తీవ్రతను గుర్తించిన జెరోధా సంస్థ, వెంటనే స్పందించింది. తమ యూజర్లలో కొందరికి యాప్లో ధరల అప్డేట్లో సమస్యలు ఎదురవుతున్నాయని అధికారికంగా అంగీకరించింది. అయితే, ఆర్డర్ ప్లేస్మెంట్కు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది.
“మా కొంతమంది యూజర్లు యాప్లో ధరల అప్డేట్ సమస్యను ఎదుర్కొంటున్నారు. మేము దీనిని పరిశీలిస్తున్నాము. ప్రస్తుతానికి, దయచేసి మొబైల్ బ్రౌజర్లో 'కైట్ వెబ్'లో లాగిన్ అవ్వండి. ఆర్డర్ ప్లేస్మెంట్కు ఎలాంటి ఆటంకం లేదు. ఈక్విటీ సెగ్మెంట్ కోసం మీరు యాప్లో 20 డెప్త్ చెక్ చేసుకోవచ్చు,” అని జెరోధా ఒక పోస్ట్లో తెలిపింది.
More to come…
{{/usCountry}}More to come…
{{/usCountry}}ఉదయం 9:51 గంటల సమయంలో ఈ సమస్య పరిష్కారమైందని అప్డేట్ చేసింది. ఈ సమస్య వల్ల కొన్ని నిమిషాల పాటు మదుపరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయినప్పటికీ, సమస్య త్వరితగతిన పరిష్కారం కావడం కొంత ఊరటనిచ్చింది.