ఫొటోలు : కర్నూలు బస్సు ప్రమాదంలో మృతిచెందిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
ఏపీలోని కర్నూలు శివారు చిన్నటేకూరు దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైంది. ఈ ఘటనలో 19 మంది సజీవ దహనం అయ్యారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైన విషయం తెలిసిందే. కర్నూలు శివారు చిన్నకూటేరులో ఈ ఘటన జరిగింది. బస్సులో ముత్తం 44 మంది ఉన్నారు. ఇద్దరు డ్రైవర్లు, మరో ఇద్దరి సిబ్బంది, 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 19 మంది సజీవ దహనం అయ్యారు. ఈ మృతదేహాలను ఫోరెన్సిక్ బృందాలు వెలికితీశాయి.
(Mohammad Aleemudin)
ఈ ఘటనలో తెలంగాణకు చెందినవారు కూడా మరణించారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ప్రమాదంలో చనిపోయిన తెలంగాణ పౌరులకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థికసాయం అందించనుంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం తెలిపారు.
(ANI Video Grab)
బస్సు ప్రమాదానికి సంబంధించి తెలంగాణ కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. గద్వాల కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నెంబర్ 9502271122, గద్వాల పోలీసు ఆఫీసు కంట్రోల్ రూమ్ నంబర్ 8712661828, కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నంబర్ 9100901604గా ఉంది.
(ANI Video Grab)
ఏపీలో కర్నూలు కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నెంబర్ : 08518-277305, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ నెంబర్ : 9121101059, ఘటనా స్థలి వద్ద కంట్రోల్ నెంబర్ : 9121101061, కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ నెంబర్ : 9121101075, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు: 9494609814, 9052951010గా ఉన్నాయి.
(PTI)
కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ , గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి అందుతుందని ప్రధాని మోదీ తెలిపారు.
(PTI)
ప్రమాద ఘటనపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రయాణికుల మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. బాధితు కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు.
(PTI)
కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రైవేటు, ప్రభుత్వ బస్సులు సరైన నియంత్రణతో నడవాలన్నారు.
(PTI)
E-Paper

