మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్ టీ తాగుతూ కబుర్లు చెప్పకుంటే-నిజం చేసిన ఏఐ- టీ కొట్టు దగ్గర స్టార్ల ముచ్చట్లు
టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వారు టీ కొట్టు దగ్గర కూర్చుని టీ తాగుతున్నట్లుగా AI ఆర్టిస్ట్ సృష్టించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఎలా ఉన్నాయో చూడండి.
ఈ ఫొటో చూశారా? అదిరిపోయింది కదా! టీ కొట్టు దగ్గర టాలీవుడ్ స్టార్లు ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి టీ తాగుతున్న పిక్ వైరల్ గా మారింది. అయితే ఇది ఏఐతో చేసిన ఫొటో.
(Instagram: SuryaTeja Kandukuri/thebackpackerboy)
ఈ చిత్రాలలో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున కూడా నవ్వుతూ కనిపిస్తున్నారు. వీటిని ఒక ఏఐ ఆర్టిస్ట్ ఊహించి సృష్టించాడు.
(Instagram: SuryaTeja Kandukuri/thebackpackerboy)
ఒక చిత్రంలో నాని, పవన్ కళ్యాణ్ కూడా ఇతర టాలీవుడ్ స్టార్లు తో పాటు క్యాజువల్ దుస్తులలో 'గరం చాయ్' కోసం చేరారు.
(Instagram: SuryaTeja Kandukuri/thebackpackerboy)
ఎస్ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్ బి, పూరి జగన్నాథ్ వంటి ప్రముఖ టాలీవుడ్ దర్శకులు కూడా లుంగీలలో కబుర్లు చెప్పుకుంటున్నారు.
(Instagram: SuryaTeja Kandukuri/thebackpackerboy)
ఇంతమంది టాలీవుడ్ స్టార్లు కలిసి కలిసి చాయ్ తాగే ఫొటో అదిరిపోయింది. ఇది ఏఐ పిక్ అయినప్పటికీ తమ అభిమాన హీరోలు ఇలా కనిపించడంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
(Instagram: SuryaTeja Kandukuri/thebackpackerboy)
రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్ కుమార్ ల ఏఐ ఫొటోలు కూడా వైరల్ గా మారాయి.
(Instagram: HooHoo/hoohoocreations80)
మరొక ఏఐ పిక్ లో సూర్య, ధనుష్, విక్రమ్, సిలంబరసన్ (శింబు) ఇడ్లీ కొట్టు దగ్గర ఇలా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు.
(Instagram: HooHoo/hoohoocreations80)
E-Paper

