ఇక వాట్సప్‌లో 'మీసేవ' సేవలు - చాలా ఈజీగా సర్టిఫికెట్లు పొందొచ్చు, ఈ నెంబర్ సేవ్ చేసుకోండి

Published on Nov 19, 2025 09:22 am IST

'మీ-సేవా’ సర్వీసులను తెలంగాణప్రభుత్వం మరింత సులభరతం చేసింది. వాట్సాప్ ద్వారా సేవలు పొందే అవకాశం కల్పించింది.8096 95 8096 నంబర్‌‌కు వాట్సాప్ చేస్తే ఏకంగా 38 శాఖల(580 సేవలు) సర్వీసులు పొందొచ్చు.

1 / 5
<p>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్‌లో మరో విప్లవాత్మక అడుగు వేసింది. మీసేవా సేవలను మరింత సరళీకృతం చేసింది. ప్రజలు అత్యంత సులభంగా వారి ఫోన్ లోని వాట్సాప్ నుంచే మీసేవా సేవలు పొందేలా అడుగు ముందుకేసింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 19, 2025 09:22 am IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్‌లో మరో విప్లవాత్మక అడుగు వేసింది. మీసేవా సేవలను మరింత సరళీకృతం చేసింది. ప్రజలు అత్యంత సులభంగా వారి ఫోన్ లోని వాట్సాప్ నుంచే మీసేవా సేవలు పొందేలా అడుగు ముందుకేసింది.

2 / 5
<p>38 శాఖలకు చెందిన 580 సర్వీసులను ఇక వాట్సాప్​ ద్వారానే పొందే అవకాశం కల్పించింది. ఈ సర్వీసులను పొందేందుకు ‘8096958096’ అనే వాట్సాప్‌‌‌‌‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తెచ్చింది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 19, 2025 09:22 am IST

38 శాఖలకు చెందిన 580 సర్వీసులను ఇక వాట్సాప్​ ద్వారానే పొందే అవకాశం కల్పించింది. ఈ సర్వీసులను పొందేందుకు ‘8096958096’ అనే వాట్సాప్‌‌‌‌‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తెచ్చింది.

3 / 5
<p>మెటా, మీసేవా సంయుక్త భాగస్వామ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘వాట్సాప్​లో మీసేవ’ సర్వీసులను ఐటీశాఖ మంత్రి శ్రీధర్​ బాబు మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 19, 2025 09:22 am IST

మెటా, మీసేవా సంయుక్త భాగస్వామ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘వాట్సాప్​లో మీసేవ’ సర్వీసులను ఐటీశాఖ మంత్రి శ్రీధర్​ బాబు మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు.

4 / 5
<p>ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంకేతికత సాయంతో పౌరసేవలను వారి ముంగిటకే చేరుస్తూ తెలంగాణ ‘గుడ్‌ గవర్నెన్స్‌’ వైపు అడుగులు వేస్తోందన్నారు. ప్రస్తుతం ఈ సేవలు ఆంగ్లంలో అందుబాటులో ఉన్నాయని…. త్వరలోనే తెలుగు, ఉర్దూ భాషల్లోనూ తీసుకొస్తామని ప్రకటించారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 19, 2025 09:22 am IST

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంకేతికత సాయంతో పౌరసేవలను వారి ముంగిటకే చేరుస్తూ తెలంగాణ ‘గుడ్‌ గవర్నెన్స్‌’ వైపు అడుగులు వేస్తోందన్నారు. ప్రస్తుతం ఈ సేవలు ఆంగ్లంలో అందుబాటులో ఉన్నాయని…. త్వరలోనే తెలుగు, ఉర్దూ భాషల్లోనూ తీసుకొస్తామని ప్రకటించారు.

5 / 5
<p>వాట్సప్‌లో మీసేవ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంచుతామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇక ఈ సేవల కోసం ముందుగా ప్రభుత్వం సూచించిన 8096958096 నెంబర్ కు హాయ్ లేదా మెనూ అని టైప్ చేసి సెండ్ చేయాలి. అందుబాటులో ఉన్న ప్రభుత్వ సేవల లిస్ట్ డిస్ ప్లే అవుతుంది. OTP ప్రాసెస్ ప్రక్రియను పూర్తి చేసి, అవసరమైన సేవను ఎంచుకోవాలి. దరఖాస్తు ఫారమ్‌ను వాట్సాప్ ఇంటర్‌ఫేస్ ద్వారా పూరించవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లు, స్కాన్ చేసిన ప్రతులను వాట్సాప్‌లోనే అప్‌లోడ్ చేయవచ్చు. ఫీజును ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా సురక్షితంగా చెల్లించవచ్చు.<br> </p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 19, 2025 09:22 am IST

వాట్సప్‌లో మీసేవ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంచుతామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇక ఈ సేవల కోసం ముందుగా ప్రభుత్వం సూచించిన 8096958096 నెంబర్ కు హాయ్ లేదా మెనూ అని టైప్ చేసి సెండ్ చేయాలి. అందుబాటులో ఉన్న ప్రభుత్వ సేవల లిస్ట్ డిస్ ప్లే అవుతుంది. OTP ప్రాసెస్ ప్రక్రియను పూర్తి చేసి, అవసరమైన సేవను ఎంచుకోవాలి. దరఖాస్తు ఫారమ్‌ను వాట్సాప్ ఇంటర్‌ఫేస్ ద్వారా పూరించవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లు, స్కాన్ చేసిన ప్రతులను వాట్సాప్‌లోనే అప్‌లోడ్ చేయవచ్చు. ఫీజును ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా సురక్షితంగా చెల్లించవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!