AP 10th Results 2026 : ఏపీ టెన్త్ ఫలితాలపై అప్డేట్ - ఈ నెలాఖారులోనే రిజల్ట్స్...!
AP SSC Results 2026 : ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం…. ఏప్రిల్ చివరి నాటికి ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
ఏపీ టెన్త్ పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీతో పూర్తి అయిన సంగతి తెలిసిందే. విద్యార్థులంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఏప్రిల్ 6వ తేదీ నుంచి మొదలుపెట్టిన జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ముగిసింది.
మూల్యాంకనం పూర్తి అయినే నేపథ్యంలో ప్రస్తుతం మార్కులను ప్రాసెసింగ్ చేస్తున్నారు. సాంకేతిక అంశాల పరిశీలన తర్వాత…. అంతా సవ్యంగా ఉంటే ఫలితాల విడుదల తేదీని ప్రకటిస్తారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ట్విట్టర్ వేదికగా మంత్రి నారా లోకేశ్ ఫలితాల వివరాలను వెల్లడిస్తారు.
ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మొత్తం 6,40,916 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఇందులో బాలురు 3,28,652 మంది, బాలికలు 3,12,264 మంది వరకు ఉన్నారు. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఈసారి ఏపీ టెన్త్ ఫలితాలను ఈ ఏప్రిల్ చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ దిశగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
ఏపీ పదో తరగతి ఫలితాలను https://results.bse.ap.gov.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనమిత్ర వాట్సాప్(9552300009) లో కూడా అందుబాటులో ఉంటాయి. మీ హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి సబ్మిట్ చేస్తే… మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
ఫలితాల ప్రకటన తర్వాత రీ-వెరిఫికేషన్ మరియు రీ-కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన షెడ్యూల్ను ఫలితాల రోజే విద్యాశాఖ విడుదల చేస్తుంది.
E-Paper

