మొంథా తుఫాన్ ఎఫెక్ట్ : ఏపీకి రూ.5,265 కోట్లు నష్టం - ప్రాథమిక అంచనా వేసిన ప్రభుత్వం
తుఫాన్ నష్టంపై ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. తుఫాన్ కారణంగా రూ.5,265 కోట్లు నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. వ్యవసాయ రంగంలో రూ.829 కోట్లు నష్టం జరిగిందని పేర్కొన్నారు.
మొంథా తుఫాన్ తో ఏపీకి భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. ఈ తుఫాన్ కారణంగా రూ.5,265 కోట్లు నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు వివరించారు.
వ్యవసాయ రంగంలో రూ.829 కోట్లు నష్టం జరిగింది. ఇక హార్టికల్చర్ రంగంలో రూ.39 కోట్లు, సెరికల్చర్ రంగంలో రూ.65 కోట్లు నష్టం, పశుసంవర్ధకశాఖలో రూ.71 లక్షల నష్టం జరిగింది.
తుఫాన్ వల్ల 20 పశువులు చనిపోయాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక ఆక్వారంగంలో రూ.1,270 కోట్లు.. మున్సిపల్ శాఖలో రూ.109 కోట్లు నష్టం, హౌసింగ్లో రూ.5.53 కోట్లు నష్టం జరిగిందని తెలిపారు.
“హుద్హుద్ తుఫాన్తో విశాఖపట్నం అతలాకుతలం అయ్యింది. వారం రోజుల్లోనే పరిస్థితులను చక్కదిద్దాం. తరువాత వచ్చిన తిత్లీ తుఫాన్ సమయంలోనూ సమర్థంగా పనిచేశాం. బుడమేరు వరదను ఎదుర్కొన్నాం. టెక్నాలజీని సమర్థంగా వినియోగిస్తున్నాం. శాటిలైట్ ఇమేజ్ల ఆధారంగా తుఫాన్ పరిస్థితులను అంచనా వేశాం. రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ సచివాలయం వరకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం” అని సీఎం చంద్రబాబు గురువారం చెప్పారు. ప్రతి ఒక్కర్నీ ఆదుకుంటామని స్పష్టం చేశారు.
E-Paper

