క్రికెట్ ఛాంపియన్ ప్లేయర్ శ్రీచరణికి ఘనస్వాగతం - గ్రూప్ 1 ఉద్యోగంతో పాటు రూ.2.5 కోట్ల నగదు పురస్కారం
టీంఇండియా ఉమెన్ టీమ్ స్టార్ శ్రీచరణి ఢిల్లీ నుంచి ఏపీకి చేరుకుంది. గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న ఆమెకు మంత్రులు అనిత, సంధ్యా రాణి, క్రికెటర్ మిథాలీ రాజ్ ఘనస్వాగతం పలికారు. మంత్రి లోకేశ్ కూడా పుష్పగుచ్చం ఇచ్చిన అభినందనలు తెలిపారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో శ్రీచరణి భేటీ అయింది.
భారత టీమ్ ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి ఏపీకి చేరుకున్నారు. శుక్రవారం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆమెకు రాష్ట్ర మంత్రులు అనిత, సంధ్యారాణి, సవిత స్వాగతం పలికారు.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని)తో పాటు శాప్ అధికారులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు పుష్పగుచ్చం ఇచ్చి శ్రీచరణికి ఘన స్వాగతం పలికారు.
శ్రీచరణితో పాటు సీఎం చంద్రబాబును కలిసేందుకు వచ్చిన మాజీ క్రికెటర్ మిథాలీరాజ్ కు మంత్రి లోకేశ్ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.
శ్రీచరణికి పుష్పంగుచ్చి స్వాగతం పలికిన మంత్రి నారా లోకేశ్.
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కలిశారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనందక్షణాలను శ్రీచరణి… సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్తో పంచుకున్నారు.
ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత దేశ మహిళల సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కలిశారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనందక్షణాలను శ్రీచరణి… సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్తో పంచుకున్నారు.
ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత దేశ మహిళల సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.
ప్రపంచకప్ లో సత్తా చాటిన శ్రీచరణిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. శ్రీచరణికి రూ.2.5 కోట్ల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. ఆమెకు గ్రూప్ 1 ఉద్యోగంతోపాటు కడపలో ఇంటి స్థలాన్ని ఇవ్వనుంది.
E-Paper

