AP SSC Exams 2026 : ఏపీ టెన్త్ పరీక్షల తేదీపై అప్డేట్ - ఈ సారి కొత్తగా క్యూఆర్ కోడ్ కూడా...!
ఏపీ పదో తరగతి పరీక్షలపై పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ ను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది. సర్కార్ ఆమోదం తర్వాత అధికారికంగా షెడ్యూల్ విడుదలవుతుంది.
ఏపీ పదో తరగతి పరీక్షలపై పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ ను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది.
పరీక్షల విభాగం పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదిస్తే అధికారికంగా షెడ్యూల్ విడుదలవుతుంది. గతేడాది 2025లో చూస్తే… టెన్త్ పరీక్షలు మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి.
ఇక టెన్త్ పరీక్షల ఫీజు షెడ్యూల్ కూడా రావాల్సి ఉంది. నవంబర్ 1వ తేదీ నుంచి ఫీజల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దాదాపు నెలరోజుల పాటు ఫీజు చెల్లింపులకు అవకాశం ఇవ్వొచ్చు.
మరోవైపు ఈసారి పరీక్ష కేంద్రాల వివరాలను సులభంగా తెలుసుకునేందుకు అధికారులు మరో ప్రయత్నం చేస్తున్నారు. పరీక్షల కోసం జారీ అయ్యే హాల్టికెట్ల వెనుక భాగంలో ఎగ్జామ్ సెంటర్ రూట్ మ్యాప్ను(క్యూఆర్ కోడ్) ముద్రించనున్నారు.
హాల్ టికెట్ లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రానికి ఎలా చేరుకోవాలో మ్యాప్ వస్తుంది. ఫలితంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
2025లో నిర్వహించిన ఏపీ టెన్త్ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎగ్జామ్స్ కు 6 లక్షల 19వేల 275 మంది విద్యార్ధులు ఫీజులు చెల్లించారు. పదో తరగతి పరీక్ష రోజు పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ణలు అమలు చేశారు.
2025లో నిర్వహించిన ఏపీ టెన్త్ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎగ్జామ్స్ కు 6 లక్షల 19వేల 275 మంది విద్యార్ధులు ఫీజులు చెల్లించారు. పదో తరగతి పరీక్ష రోజు పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ణలు అమలు చేశారు.
ఈ ఏడాది(2025) ఏపీలో 6,14, 459మంది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 81.14శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురలో 78.31శాతం, బాలికల్లో 84.09శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 1680 పాఠశాలల్లో 100శాతం ఉత్తీర్ణత నమోదైంది. 19పాఠశాలల్లో 0శాతం ఉత్తీర్ణత నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 93.90శాతం ఉత్తీర్ణులు అయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 47.64శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఈ ఏడాది(2025) ఏపీలో 6,14, 459మంది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 81.14శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురలో 78.31శాతం, బాలికల్లో 84.09శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 1680 పాఠశాలల్లో 100శాతం ఉత్తీర్ణత నమోదైంది. 19పాఠశాలల్లో 0శాతం ఉత్తీర్ణత నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 93.90శాతం ఉత్తీర్ణులు అయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 47.64శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఏపీ టెన్త్ ఎగ్జామ్స్, పరీక్షల ఫీజు చెల్లింపు, హాల్ టికెట్ల జారీ, పరీక్షల తేదీలకు సంబంధించిన అప్డేట్స్ https://bse.ap.gov.in/ వెబ్ సైట్ లో తెలుసుకోవాలి.
E-Paper

