AP SSC Exams 2026 : ఏపీ టెన్త్ పరీక్షల తేదీపై అప్డేట్ - ఈ సారి కొత్తగా క్యూఆర్ కోడ్ కూడా...!

By , Andhrapradesh
Published on Oct 26, 2025 10:02 am IST

ఏపీ పదో తరగతి పరీక్షలపై పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ ను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది. సర్కార్ ఆమోదం తర్వాత అధికారికంగా షెడ్యూల్ విడుదలవుతుంది.

1 / 8
<p>ఏపీ పదో తరగతి పరీక్షలపై పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ ను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 26, 2025 10:02 am IST

ఏపీ పదో తరగతి పరీక్షలపై పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ ను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది.

2 / 8
<p>పరీక్షల విభాగం పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదిస్తే అధికారికంగా షెడ్యూల్ విడుదలవుతుంది. గతేడాది 2025లో చూస్తే… టెన్త్ పరీక్షలు మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 26, 2025 10:02 am IST

పరీక్షల విభాగం పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదిస్తే అధికారికంగా షెడ్యూల్ విడుదలవుతుంది. గతేడాది 2025లో చూస్తే… టెన్త్ పరీక్షలు మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి.

3 / 8
<p>ఇక టెన్త్ పరీక్షల ఫీజు షెడ్యూల్ కూడా రావాల్సి ఉంది. నవంబర్ 1వ తేదీ నుంచి ఫీజల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దాదాపు నెలరోజుల పాటు ఫీజు చెల్లింపులకు అవకాశం ఇవ్వొచ్చు.</p><p> </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 26, 2025 10:02 am IST

ఇక టెన్త్ పరీక్షల ఫీజు షెడ్యూల్ కూడా రావాల్సి ఉంది. నవంబర్ 1వ తేదీ నుంచి ఫీజల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దాదాపు నెలరోజుల పాటు ఫీజు చెల్లింపులకు అవకాశం ఇవ్వొచ్చు.

4 / 8
<p>మరోవైపు ఈసారి పరీక్ష కేంద్రాల వివరాలను సులభంగా తెలుసుకునేందుకు అధికారులు మరో ప్రయత్నం చేస్తున్నారు. పరీక్షల కోసం జారీ అయ్యే హాల్‌టికెట్ల వెనుక భాగంలో ఎగ్జామ్ సెంటర్ రూట్‌ మ్యాప్‌ను(క్యూఆర్ కోడ్) ముద్రించనున్నారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 26, 2025 10:02 am IST

మరోవైపు ఈసారి పరీక్ష కేంద్రాల వివరాలను సులభంగా తెలుసుకునేందుకు అధికారులు మరో ప్రయత్నం చేస్తున్నారు. పరీక్షల కోసం జారీ అయ్యే హాల్‌టికెట్ల వెనుక భాగంలో ఎగ్జామ్ సెంటర్ రూట్‌ మ్యాప్‌ను(క్యూఆర్ కోడ్) ముద్రించనున్నారు.

5 / 8
<p>హాల్ టికెట్ లోని క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే పరీక్ష కేంద్రానికి ఎలా చేరుకోవాలో మ్యాప్‌ వస్తుంది. ఫలితంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 26, 2025 10:02 am IST

హాల్ టికెట్ లోని క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే పరీక్ష కేంద్రానికి ఎలా చేరుకోవాలో మ్యాప్‌ వస్తుంది. ఫలితంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.

6 / 8
<div><p>2025లో నిర్వహించిన ఏపీ టెన్త్ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎగ్జామ్స్ కు 6 లక్షల 19వేల 275 మంది విద్యార్ధులు ఫీజులు చెల్లించారు. పదో తరగతి పరీక్ష రోజు పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ణలు అమలు చేశారు.</p></div> expand-icon View Photos in a new improved layout
Published on Oct 26, 2025 10:02 am IST

2025లో నిర్వహించిన ఏపీ టెన్త్ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎగ్జామ్స్ కు 6 లక్షల 19వేల 275 మంది విద్యార్ధులు ఫీజులు చెల్లించారు. పదో తరగతి పరీక్ష రోజు పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ణలు అమలు చేశారు.

7 / 8
<div><p>ఈ ఏడాది(2025) ఏపీలో 6,14, 459మంది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 81.14శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురలో 78.31శాతం, బాలికల్లో 84.09శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 1680 పాఠశాలల్లో 100శాతం ఉత్తీర్ణత నమోదైంది. 19పాఠశాలల్లో 0శాతం ఉత్తీర్ణత నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 93.90శాతం ఉత్తీర్ణులు అయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 47.64శాతం ఉత్తీర్ణత నమోదైంది.</p></div> expand-icon View Photos in a new improved layout
Published on Oct 26, 2025 10:02 am IST

ఈ ఏడాది(2025) ఏపీలో 6,14, 459మంది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 81.14శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురలో 78.31శాతం, బాలికల్లో 84.09శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 1680 పాఠశాలల్లో 100శాతం ఉత్తీర్ణత నమోదైంది. 19పాఠశాలల్లో 0శాతం ఉత్తీర్ణత నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 93.90శాతం ఉత్తీర్ణులు అయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 47.64శాతం ఉత్తీర్ణత నమోదైంది.

8 / 8
<p>ఏపీ టెన్త్ ఎగ్జామ్స్, పరీక్షల ఫీజు చెల్లింపు, హాల్ టికెట్ల జారీ, పరీక్షల తేదీలకు సంబంధించిన అప్డేట్స్ <a href="https://bse.ap.gov.in/" target="_blank">https://bse.ap.gov.in/</a> వెబ్ సైట్ లో తెలుసుకోవాలి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 26, 2025 10:02 am IST

ఏపీ టెన్త్ ఎగ్జామ్స్, పరీక్షల ఫీజు చెల్లింపు, హాల్ టికెట్ల జారీ, పరీక్షల తేదీలకు సంబంధించిన అప్డేట్స్ https://bse.ap.gov.in/ వెబ్ సైట్ లో తెలుసుకోవాలి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!