నవంబర్లో ఏపీ టెట్ నోటిఫికేషన్.. జనవరి 2026లో స్పెషల్ డీఎస్సీ!
AP TET Notification 2025 : టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ఈ ఏడాది నవంబర్లో ఏపీ టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులు ఈ మేరకు సిద్ధంగా ఉండాలి.
ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రక్రియను ముగించిన విషయం తెలిసిందే. ఇందులో సెలక్ట్ అయిన టిచర్లు ఇప్పటికే విధుల్లో చేరారు. మరోవైపు ఉద్యోగం రాని అభ్యర్థులకు నిరాశపడొద్దని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. మళ్లీ అవకాశం ఉంటుందని చెప్పారు.
వచ్చే ఏడాది జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనిపై మంత్రి నారా లోకేశ్ కూడా ప్రకటన చేశారు.
అంతకంటే ముందు నవంబర్లో ఏపీ టెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. నవంబర్ చివరివారంలో టెట్ నిర్వహించి, 2026 జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడదల చేయనుంది ప్రభుత్వం.
కొత్త డీఎస్సీ నిర్వహణ తర్వాత వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళిక అమలు చేస్తామన్నారు. స్పెషల్ డీఎస్సీలో మొత్తం 2,260 పోస్టులకు ఇప్పటికే ఆర్థికశాఖ నుంచి అనుమతి లభించింది. దీంతో అభ్యర్థులు సన్నద్ధంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
E-Paper

