మంచి జీతంతో బెల్లో ఉద్యోగాలు.. ఆన్లైన్ దరఖాస్తుకు మిగిలింది కొన్ని రోజులే!
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో వివిధ విభాగాల్లో ప్రొబేషనరీ ఇంజినీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే దరఖాస్తు గడువు సమీపిస్తోంది. వెంటనే అప్లై చేయండి.
కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేయాలనుకునేవారికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అవకాశం కల్పిస్తోంది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. 340 పోస్టులను భర్తీ చేస్తున్నారు. బీఈ, బీటెక్ పూర్తిచేసిన వారు అప్లై చేసుకోవాలి.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. ఎంపికైనవారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్టాణక, తమిళనాడు, మహరాష్ట్ర, హర్యానా, ఉత్తరాఖండ్లో పనిచేసేందుకు రెడీగా ఉండాలి. ఎలక్ట్రానిక్స్-175, కంప్యూటర్ సైన్స్-42, మెకానికల్-109, ఎలక్ట్రికల్ 14 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఈడబ్ల్యూఎస్కు 34, అన్రిజర్వుడ్ 139, ఓబీసీ-ఎన్సీఎల్ 91, ఎస్సీ 51, ఎస్టీ 25 పోస్టులు కేటాయించారు.
నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా విద్యార్హతలు ఉండాలి. వయసు 2025, అక్టోబర్ 1 నాటికి 25 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ-ఎన్సీఎల్కు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం నెలకు రూ.40 వేల నుంచి రూ.1.4 లక్షల వరకు వస్తుంది. దరఖాస్తు ఫీజు రూ.1180, ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు ఎలాంటి ఫీజు ఉండదు. www.bel-india.in వెబ్సైట్లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 14గా నిర్ణయించారు. వెంటనే అప్లై చేయాలి.
E-Paper

